BigTV English

Visakhapatnam : అక్టోబర్ నుంచి విశాఖ కేంద్రంగా పాలన.. అసెంబ్లీ సమావేశాల్లో క్లారిటీ..

Visakhapatnam : అక్టోబర్ నుంచి విశాఖ కేంద్రంగా పాలన.. అసెంబ్లీ సమావేశాల్లో క్లారిటీ..

Visakhapatnam : విశాఖ నుంచే పాలన.. కొంత కాలంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇదే మాట పదే పదే చెబుతున్నారు. చేతలు మాత్రం నత్తనడకగానే ఉన్నాయి. తొలుత ఈ ఏడాది ఉగాది నుంచే విశాఖ నుంచి పాలన అన్నారు. అమరావతి వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో తీర్పు తర్వాత రాజధాని తరలిస్తారని భావించారు. ఆ తర్వాత సెప్టెంబర్ లో వైజాగ్ వెళతామన్నారు.


వాస్తవానికి జూలై 11న సుప్రీంకోర్టులో అమరావతిపై విచారణ జరగాల్సి ఉండగా.. డిసెంబర్ కు వాయిదా పడింది. దీంతో రాజధాని తరలింపు సెప్టెంబర్ లో ఉండదని తేలిపోయింది. కానీ తర్వాత విశాఖ నుంచి పాలనపై సీఎం జగన్ , మంత్రులు ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. రాజధాని తరలింపు కార్యాచరణ కనిపించలేదు. డిసెంబర్ లో సుప్రీంకోర్టు తీర్పు వస్తే.. ఆ తర్వాత కొన్నిరోజులకే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందుకు రాజధాని తరలింపు ఉండదనేది స్పష్టమైంది. కానీ తాజాగా రాజధాని తరలింపుపై కొత్త అప్ డేట్ వచ్చింది.

సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి త్వరలో వైజాగ్‌ షిఫ్ట్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్‌ నుంచి వైజాగ్ కేంద్రంగానే పరిపాలన కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దసరా నాటికి జగన్‌ విశాఖకు వెళ్తారని.. అక్కడ కొత్త ఇల్లుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.


ఒకవేళ సీఎం వైఎస్ జగన్ అక్టోబర్‌లో వైజాగ్‌ వెళ్లకపోతే అమరావతి నుంచే పాలన కొనసాగిస్తారు. దీనిపై త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tags

Related News

AP Ministers: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రులు.. ఎందుకు వెళ్లారంటే?

AP Power Charges: ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. నవంబర్ నుంచి తగ్గనున్న విద్యుత్ బిల్లులు

Tirumala Garuda Seva: భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. అంగరంగ వైభవంగా శ్రీవారి గరుడ సేవ

GST Relief To Farmers: జీఎస్టీ తగ్గింపుతో రైతులకు భారీ ఊరట.. వేటిపై ధరలు తగ్గనున్నాయంటే?

AP Weather: అక్టోబర్ 1 నాటికి మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ప్రాజెక్టుల్లో వరద ప్రవాహాలు

Gudivada Amarnath: కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట: గుడివాడ అమర్నాథ్

AP Fee Reimbursement: పండుగ వేళ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.394 కోట్లు విడుదల

Vijayawada Traffic Diversions: మూల నక్షత్రంలో సరస్వతిదేవిగా దుర్గమ్మ దర్శనం.. రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

Big Stories

×