E-Paper
Advertisement

Visakhapatnam : అక్టోబర్ నుంచి విశాఖ కేంద్రంగా పాలన.. అసెంబ్లీ సమావేశాల్లో క్లారిటీ..

Visakhapatnam : అక్టోబర్ నుంచి విశాఖ కేంద్రంగా పాలన.. అసెంబ్లీ సమావేశాల్లో క్లారిటీ..
Advertisement

Visakhapatnam : విశాఖ నుంచే పాలన.. కొంత కాలంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇదే మాట పదే పదే చెబుతున్నారు. చేతలు మాత్రం నత్తనడకగానే ఉన్నాయి. తొలుత ఈ ఏడాది ఉగాది నుంచే విశాఖ నుంచి పాలన అన్నారు. అమరావతి వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో తీర్పు తర్వాత రాజధాని తరలిస్తారని భావించారు. ఆ తర్వాత సెప్టెంబర్ లో వైజాగ్ వెళతామన్నారు.

వాస్తవానికి జూలై 11న సుప్రీంకోర్టులో అమరావతిపై విచారణ జరగాల్సి ఉండగా.. డిసెంబర్ కు వాయిదా పడింది. దీంతో రాజధాని తరలింపు సెప్టెంబర్ లో ఉండదని తేలిపోయింది. కానీ తర్వాత విశాఖ నుంచి పాలనపై సీఎం జగన్ , మంత్రులు ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. రాజధాని తరలింపు కార్యాచరణ కనిపించలేదు. డిసెంబర్ లో సుప్రీంకోర్టు తీర్పు వస్తే.. ఆ తర్వాత కొన్నిరోజులకే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందుకు రాజధాని తరలింపు ఉండదనేది స్పష్టమైంది. కానీ తాజాగా రాజధాని తరలింపుపై కొత్త అప్ డేట్ వచ్చింది.

Advertisement

సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి త్వరలో వైజాగ్‌ షిఫ్ట్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్‌ నుంచి వైజాగ్ కేంద్రంగానే పరిపాలన కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దసరా నాటికి జగన్‌ విశాఖకు వెళ్తారని.. అక్కడ కొత్త ఇల్లుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.

ఒకవేళ సీఎం వైఎస్ జగన్ అక్టోబర్‌లో వైజాగ్‌ వెళ్లకపోతే అమరావతి నుంచే పాలన కొనసాగిస్తారు. దీనిపై త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tags

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×