E-Paper
Advertisement

Jagan’s Delhi Maha dharna: హస్తినలో జగన్ మహాధర్నా, ముందే షాకిచ్చిన కేంద్రం..

Jagan’s Delhi Maha dharna: హస్తినలో జగన్ మహాధర్నా, ముందే షాకిచ్చిన కేంద్రం..
Advertisement

Jagan’s Delhi Maha dharna: వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ మహాధర్నా పరిస్థితి ఏంటి? పొలిటికల్ మైలేజ్ కోసమే ఆయన హస్తినకు వచ్చారా? అసెంబ్లీ సమావేశాలను హాజరుకాకుండా, ఢిల్లీ ధర్నా చేపట్టడం వెనుక మతలబు ఏంటి? కేంద్రం పెద్దలు ఎందుకు ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు? చాలా వరకు మాజీ నేతలు ఎందుకు దూరంగా ఉన్నారు? ఇవే ప్రశ్నలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అరాచక పరిస్థితులు రాజ్యమేలుతున్నాయని కోరుతూ
వైసీపీ అధినేత జగన్ బుధవారం ఢిల్లీలో మహాధర్నాకు పిలుపునిచ్చారు. జంతర్ మంతర్ వేదికగా ధర్నా జరగనుంది. వైసీపీకి చెందిన కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అక్కడికి చేరుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదువరకు జరగనుంది. ధర్నా వేదిక వద్ద ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.

Advertisement

టీడీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన హత్యలకు సంబంధించి ఫోటోలను అక్కడ ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్నది ఆయన ప్రధాన డిమాండ్. అయితే ఈ ధర్నాకు వైసీపీకి చెందిన కొంతమంది నేతలు హాజరుకాలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: ఏపీకి బడ్జెట్ కేటాయింపులపై వైసీపీ రియాక్షన్

Advertisement

ధర్నా నేపథ్యంలో బీజేపీ పెద్దలను కలవాలని జగన్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పటివరకు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తమకున్న పరిచయాలతో కేంద్ర పెద్దలను కలిసేందుకు ఆ పార్టీలు  తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ధర్నా ముగిసేసరికి అపాయింట్మెంట్ లభిస్తుందో లేదో చూడాలి. బీజేపీ పెద్దలు జగన్‌కు అపాయింట్మెంట్ ఇవ్వరని ఏపీ కమలనాథులు చెబుతున్నమాట. ఈ పరిస్థితి జగన్‌కు ఎందుకు వచ్చిందనే దానిపై నేతలు తలా విధంగా చర్చించుకుంటున్నారు.

ఇంకోవైపు జగన్ ధర్నాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రియాక్ట్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో ధర్నాలు, నిరసనలు చేసే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుందన్నారు. మంగళవారం సభలో మాట్లాడిన ఆయన, ధర్నాలో బాబాయ్‌ని ఎవరు చంపారో చెబితే బాగుంటుందని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. శాంతి భద్రతల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదన్నారు. నేతలు ప్రతీకార చర్యలు పాల్పడవద్దని సభా వేదికగా తెలిపారు. అలా చేస్తే వైసీపీకి-మనకు తేడా లేకుండా పోతుందన్నారు.

జగన్ ధర్నాపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా రియాక్ట్ అయ్యారు. కేవలం ఉనికి కోసం వైసీపీ ఆరాటపడుతోందన్నారు. అసెంబ్లీ సమావేశాల నుంచి తప్పించుకోవడం జగన్ ఈ ప్లాన్ చేశారన్నా రు. అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారని, ఈ విషయంలో జగన్ ఎందుకు అసెంబ్లీకి వెళ్లలేదని ప్రశ్నించారు. మొత్తానికి జగన్ వేసిన ప్లాన్ బూమరాంగ్ అయినట్టే కనిపిస్తోంది. ధర్నా ముగిసే సరికి ఇంకెన్ని అంతర్గత విషయాలు బయటకు వస్తాయో చూడాలి.

 

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×