BigTV English
Advertisement

EX minister Jogi ramesh: మాజీమంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు, ఇంటిపై ఏసీబీ దాడులు, వీలైతే అరెస్ట్..

EX minister Jogi ramesh: మాజీమంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు, ఇంటిపై ఏసీబీ దాడులు, వీలైతే అరెస్ట్..

ACB raids on Jogi Ramesh(Political news in AP): వైసీపీ నేతల డొంక కదులుతోంది. కీలక నేతలపై కూటమి సర్కార్ దృష్టి సారించింది. ఇప్పటికే మదనపల్లి ఫైల్స్ కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి ప్రమేయమున్నట్లు వార్తలు వస్తున్నాయి.


తాజాగా మాజీ మంత్రి, వైసీపీ ఫైర్‌బ్రాండ్ జోగి రమేష్ వంతైంది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఉమ్మడి కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీమంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది. మొత్తం 15 ఏసీబీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకున్న అధికారులు, సోదాలు ముమ్మరం చేశారు.

మంగళవారం ఉదయం ఐదుగంటల నుంచి మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలకు దిగింది. గన్నవరంలోని అగ్రి‌ గోల్డ్ భూముల వ్యవహారంలో ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఐడీ అధికారులు ఇప్పటికే జప్తు చేసిన భూములు.. క్రయవిక్రయాలు జరిగాయి. డీజీపీ ఆదేశాలతో ఏసీబీ రంగంలోకి దిగింది.


ALSO READ: అమరావతిలో వరల్డ్ బ్యాంకు టీమ్, సీఎం చంద్రబాబుతో భేటీ.. కాకపోతే,

వైసీపీ పాలనలో గన్నవరంలోని సర్వే నెంబర్లు మార్చి వేర్వేరు పేర్ల మీద ఆయా భూములను రిజిస్ట్రేషన్ చేయించి, వాటిని అమ్మడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి జోగి రమేష్, అధికారులపై ఒత్తిడి చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు డీజీపీకి నివేదికలు వెళ్లాయి.

సీఐడీ ఆధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను ఏ విధంగా విక్రయించారు? అవతలివారు ఆ భూములను  ఎలా కొనుగోలు చేశారు? ఇందులో అధికారుల పాత్ర ఏమిటి? అనేదానిపై క్లారిటీ రానుంది. విచారణలో తేలిన అంశాల ప్రకారం జోగి రమేష్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

 

Related News

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

Big Stories

×