E-Paper
Advertisement

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!
Advertisement

Hot water: చలికాలంతో పాటు మిగతా సీజన్లలోనూ చాలామంది వేడినీళ్లు తాగుతుంటారు. ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ రసం కలుపుకుని తాగుతుంటారు. ఇది మన పొట్టను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. ఇలా ఉదయం వేడినీళ్లు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని మన పెద్దలు చెబుతుంటారు. ఇది మన రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి తోడ్పడుతుందని, అందుకే తరచూ తాగమని సలహా ఇస్తుంటారు. అయితే, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నవాళ్లు తరచూ వేడినీళ్లు తాగడం వల్ల.. ఆ సమస్యలు మరింత పెరుగుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి వాళ్లు వేడినీళ్లు తీసుకోకూడదు? ఎక్కువగా తాగితే ఏమౌతుంది? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మరింత బలహీన పడొచ్చు:

సాధారణం కంటే తక్కువ రక్తపోటు ఉన్నట్లయితే.. ప్రతిరోజూ ఉదయం వేడినీళ్లు తాగడం వల్ల మరింత బలహీన పడవచ్చు. కొన్నిసార్లు తల తిరుగుతున్నట్లు అనిపించవచ్చు. వేడినీళ్లు రక్త నాళాలను విస్తరిస్తుంది కాబట్టి.. ఇది రక్తపోటును మరింత తగ్గిస్తుంది. తక్కువ రక్తపోటు ఉన్నవారు చాలావేడిగా కాకుండా గోరువెచ్చని నీరు మాత్రమే తీసుకోవాలి.

గుండెపై ఒత్తిడి:

Advertisement

గుండె సంబంధిత సమస్యులు ఉన్నవాళ్లు.. చాలా వేడిగా నీటిని తీసుకోకూడదు. వేడి ఎక్కువగా ఉండటం వల్ల శరీర సిరలు, ధమనులపై ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది అసాధారణ హృదయ స్పందనలకు దారితీయొచ్చు. కాబట్టి.. ఉదయం పూట వేడిగా కాకుండా మీ గది ఉష్ణోగ్రతకు సరిపోయేలా నీరు తాగడం ఉత్తమం.

పరిస్థితి మరింత తీవ్రం:

అసిడిటీ లేదా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నవాళ్లు.. వేడినీళ్లు తీసుకుంటే.. ఆమ్లత యొక్క పరిస్థితి తీవ్రతరం అవుతుంది. అధిక వేడినీరు కడుపు లైనింగ్‌ను దెబ్బతీస్తుంది. శ్లేష్మ పొరను బలహీనపరుస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్‌ను పెంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మైగ్రేన్.. దంత ససమ్యలు:

Advertisement

వేడివేడిగా నీళ్లు తాగడం వల్ల కొంతమందిలో మైగ్రేన్ తీవ్రత పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రతలో ఆకస్మిక పెరుగుదల రక్త నాళాలను విస్తరిస్తుంది. దీంతో తీవ్రమైన తలనొప్పి లేదా వణుకు వస్తుంది. కాబట్టి.. మైగ్రేన్ సమస్యలు ఉంటే.. ఉదయం చల్లటి లేదా సాధారణ నీటిని తాగాలి. అలాగే దంతాలు, చిగుళ్ల సమస్యలున్నవాళ్లు కూడా వేడినీటిని తీసుకోవడం హానికరం. ఇది ఎనామిల్‌ను దెబ్బతీసి, చిగుళ్ల వాపును పెంచుతుంది. ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ గది ఉష్ణోగ్రతను బట్టి చల్లని లేదా గోరువెచ్చని నీటిని తీసుకోవడం ఉత్తమం.

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×