E-Paper
Advertisement

నాడు వివేకా.. నేడు దస్తగిరి.. వైసీపీ ‘రక్త చరిత్ర’పై టీడీపీ పవర్‌ఫుల్ కౌంటర్!

నాడు వివేకా.. నేడు దస్తగిరి..  వైసీపీ ‘రక్త చరిత్ర’పై టీడీపీ పవర్‌ఫుల్ కౌంటర్!
Advertisement

Kadapa: కడప జిల్లాలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలపై టీడీపీ రీజినల్ కో ఆర్డినేటర్ శ్రీనివాసులు రెడ్డి చేసిన వ్యాఖ్యాలు ఇప్పుడు రాజకీయంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా అలంఖాన్ పల్లెకు చెందిన పెద్ద దస్తగిరి హత్యోదంతం జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిని మరోసారి చర్చకు వచ్చేలా చేసింది. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది మెుదటి నుంచి ‘హత్య సంస్కృతి’ అని, అధికారం ఉన్నా లేకపోయినా ఆ పార్టీ నేతలు రక్తపాతానికి వెనకాడరని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

వైసీపీ నేతల బరితెగింపు 

Advertisement

చంద్రబాబు నాయుడు పాలనలో శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఉండేదని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పటివీ వైసీపీ నేతలు బరితెగించి దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద దస్తగిరి అనే వ్యక్తిపై తొలుత కత్తిపోట్లతో దాడి చేసి, చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన సమయంలో కూడా వదలకుండా అక్కడే మాటువేసి అంతం చేయడం వారి క్రూరత్వానికి పరాకాష్ట అని విమర్శించారు. ఈ హత్య వెనుక మాజీ డిప్యూటీ మేయర్ ప్రమేయం ఉందన్నిది స్పష్టంగా కనిపిస్తోందని, ఇందుకు సంబంధించిన ఆధాారాలను కూడా పోలీసులు సేకరించారని ఆయన పేర్కొన్నారు.

కడప జిల్లాలో భారీ ఎత్తున భూ ఆక్రమాలు

Advertisement

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కడప జిల్లాలో భారీ ఎత్తున భూ అక్రమాలు జరిగాయని శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. సామాన్యుల భూములను బెదిరించి లాక్కోవడం, విలువైన స్థలాలను తక్కువ ధరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వంటి దౌర్జన్యాలకు వైసీపీ నేతలు పాల్పడ్డారని మండిపడ్డారు. భూ లావాదేవీల్లో తలెత్తిన విభేదాల వల్లే  ఇప్పుడు పెద్ద దస్తగిరిని హత్య చేశారని ఆయన వివరించారు. సొంత పార్టీ నేతల మధ్య ఉన్న భూ తగదాలే ఈ రక్తపాతానికి కారణమని, చివరకు బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని కూడా ఇలాగే హత్య చేసి ఎదుటివారిపై బురదజల్లడానికి ప్రయత్నించారని గుర్తు చేశారు.

శ్రీనివాసులు రెడ్డి డిమాండ్

వైసీపీ అరాచకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి హత్య రాజకీయాలను ప్రోత్సహించే పార్టీని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులను పోలీసులు పారదర్శకంగా విచారించి కఠినంగా శిక్షించాలని శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు. కడప గడ్డపై ఫ్యాక్టన్ నీడలు తొలగిపోయి, సామాన్యుడికి రక్షణ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Also Read: సొంత గూటిలోనే సీటు లేదు.. మాపై విమర్శలా? హరీష్‌రావుపై తుమ్మల కామెంట్స్

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×