E-Paper
Advertisement

Amaravati: బెంగుళూరు నుంచి లోటస్‌‌పాండ్‌కు మకాం! వారానికి ఒకసారి తాడేపల్లికి జగన్, మరి కోర్టు మాటేంటి?

Amaravati: బెంగుళూరు నుంచి లోటస్‌‌పాండ్‌కు మకాం! వారానికి ఒకసారి తాడేపల్లికి జగన్,  మరి కోర్టు మాటేంటి?
Advertisement

Amaravati: వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మకాం మార్చబోతున్నారా? బెంగుళూరు నుంచి లోటస్‌ పాండ్ షిఫ్ట్ అవుతున్నారా? ఉన్నట్లుండి ఈ మార్పు వెనుక కారణమేంటి? జ్యోతిష్యుల సలహాతో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారా? తాడేపల్లి ప్యాలెస్ కలిసి రాలేదా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

బెంగుళూరు నుంచి లోటస్‌‌పాండ్‌కు జగన్ మకాం!

Advertisement

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు పూర్తి కావడంతో యాక్టివ్ మోడ్‌లోకి రావాలని జగన్ డిసైడ్ అయ్యారట. చీటికి మాటికీ బెంగుళూరు వెళ్లిపోవడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలకు ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యలహంక నుంచి లోటస్‌పాండ్ మారాలని డిసైట్ అయినట్టు వైసీపీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.

ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి.  వైసీపీ అధికారంలోకి రాకముందు లోటస్‌పాండ్ నుంచి వ్యవహారాలను నడిపారు. 2019 ఎన్నికలకు ముందు వ్యవహారాలను అక్కడి నుంచే నడిపారు. అంతేకాదు నిత్యం మీడియాలో ఆయన గురించి రకరకాల వార్తలు వచ్చాయి. దీంతో వైసీపీకి జనాల్లో ఒక్కసారి వేవ్ రావడం మొదలైంది.  వైసీపీ గెలవడం ఈజీ అయ్యిందట.

Advertisement

వారానికి ఒకసారి తాడేపల్లికి జగన్, జ్యోతిష్యుల సలహా మేరకే?

మరొక వెర్షన్‌కి వెళ్దాం.. జ్యోతిష్యులు కూడా తాడేపల్లి ప్యాలెస్ కంటే లోటస్‌పాండ్ కలిసి వస్తుందని  చెప్పారట. హైదరాబాద్‌లో ఉండడం నిత్యం వార్తల్లో నిలుస్తారని, గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం అదే విధంగా రాజకీయాలు నడిపారని అంటున్నారు.

ఇంకోవైపు వెర్షన్‌కి వద్దాం.. ఇటీవలకాలంలో విజయమ్మ ఫ్యామిలీలో ఆస్తుల విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకానొక దశలో ఆమె మీడియా ముందుకొచ్చారు. జరిగిన విషయాలను బయటపెట్టారు. ఇలాంటి పరిస్థితి లోటస్‌పాండ్‌కు దూరంగా ఉంటే చేజారిపోతుందని భావించిన అధినేత ఈ స్కెచ్ వేసినట్టు వైసీపీలో కొందరు నేతలు చెబుతున్నారు.

ALSO READ:  క‌విత కొత్త పార్టీలో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ అమ‌లు! పార్టీలో ప‌ద‌వులు కూడా!

వైసీపీ అధినేతకు హైదరాబాద్‌లో ఉండడం పెద్ద సమస్య కాదు. కాకపోతే తన కేసుల విషయంలో న్యాయస్థానాలకు వెళ్లాల్సి వస్తుందన్నది ఆయన భయం. దీనివల్ల ఆయన తాడేపల్లి నుంచి బెంగుళూరుకు మకాం మార్చినట్టు చెబుతున్నారు. జరిగిన.. జరగనున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న జగన్, లోటస్‌పాండ్ కు మకాం మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దీనివల్ల వార్తల్లో నిలవడమేకాదు.. పార్టీ నేతలకు అందుబాటులో ఉన్నట్లు అవుతుందని అంటున్నారు.  తెలంగాణలో తనను నమ్ముకున్నవారికి సహాయం చేసినట్టు ఉంటుందని అంటున్నారు. మొత్తానికి జగన్ మకాం మారడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఇంతకీ మకాం ఎప్పుడు మారబోతున్నారు అన్నదే అసలు ప్రశ్న.

Related News

మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

నాన్న‌న‌నిన నేను నిన్న‌న‌నా..! న‌న్న‌నిన‌ నీ నాన్న‌ను నేన‌న‌నా?

ముళ్ల కుర్చీపై కూర్చున్న మ‌ల్ల‌న్న‌! బాస్‌ను తిట్టే తిట్ల‌న్నీ వింటూ ఓపిగ్గా భ‌రించిన మ‌ల్లారెడ్డి..!

ప‌శ్చాత్తాపాలు.. మీ పాపాల‌ను క‌డ‌గ‌లేవు! అందెశ్రీ గ‌ళానికి సంకెళ్లేశావు..! ఫామ్‌హౌజ్‌లో నిన్ను బంధీ చేశాము..!

డెబ్బైవేల‌కు ఒక్క‌రు త‌గ్గినా.. త‌ల‌న‌రుక్కుంటా..! ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ఎవ‌రి లెక్క‌లు వారివే..

కేటీఆర్ ప‌శ్చాత్తాపం! పొరపాట్ల‌కు చింతిస్తున్నాం.. మీ ఆకాంక్ష‌ల బాధ్య‌త నేను తీసుకుంటా..!

ఇక చివరి దరువు ధరణి! విచారణలేనా!? చర్యలుండవా…? జ‌నం ఏమ‌నుకుంటున్నారు..?

మావిగ‌న్‌ను ముంచిన అమ‌రావ‌తి!జ‌గ‌న్‌కు చెంప‌పెట్టులాంటి బాబు ఆన్స‌ర్.. అమ‌రావ‌తి ఆర్థిక మండ‌లి..!

Big Stories

Advertisement
×