BigTV English

Kadiyam Farmers: న్యూఇయర్ కు సరికొత్తగా స్వాగతం పలికిన కడియం నర్సరీ రైతులు

Kadiyam Farmers: న్యూఇయర్ కు సరికొత్తగా స్వాగతం పలికిన కడియం నర్సరీ రైతులు

Kadiyam Farmers: నూతన సంవత్సరానికి తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులు వినూత్న రీతిలో స్వాగతం పలికారు. యువ నర్సరీ రైతులు విన్నూత్న రీతిలో ఏర్పాటుచేసిన అద్భుత కూర్పులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వేలాది స్వదేశీ, విదేశీ మొక్కలతో పదుల సంఖ్యలో కూలీలు గత వారం రోజులుగా శ్రమించి వీటిని తీర్చిదిద్దారు. కడియపులంక పుల్లా ఆంజనేయులుకు చెందిన శ్రీ సత్యదేవ నర్సరీలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా మొక్కలతో ఈ అయోధ్య రామాలయాన్ని ఎంతో అద్భుతంగా రూపొందించారు.


సుమారు 50 వేల మొక్కలు, పువ్వులతో తీర్చిదిద్దారు. నర్సరీలో ఏర్పాటు చేసిన 2024 సంవత్సరం స్వాగత ఏర్పాట్లు కూడా సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వేలాది మొక్కలతో రూపొందించిన ఈ నూతన సంవత్సర స్వాగత కూర్పు సందర్శకులను రా రమ్మని ఆహ్వానిస్తున్నాయి. 2024 సంవత్సరానికి స్వాగతం పలకడంలో కడియం నర్సరీ రైతులు తమ మార్కును ప్రదర్శించారు.


Related News

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Big Stories

×