E-Paper
Advertisement

ONGC Gas Leak: కోనసీమలో ఆరని గ్యాస్ లీక్ మంటలు.. అంతర్జాతీయ నిపుణులతో ఓఎన్‌జీసీ సంప్రదింపులు

ONGC Gas Leak: కోనసీమలో ఆరని గ్యాస్ లీక్ మంటలు.. అంతర్జాతీయ నిపుణులతో ఓఎన్‌జీసీ సంప్రదింపులు
Advertisement

ONGC Gas Leak: కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్ ఘటనపై ఓఎన్జీసీ స్పందించింది. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది. ఇరుసుమండ ఘటనాస్థలికి అగ్ని మాపక సిబ్బందిని పంపిస్తున్నామని పేర్కొంది. గ్యాస్ లీకైన ప్రదేశం మారుమూల ప్రాంతంలో ఉందని, అక్కడికి సుమారు 600 మీటర్ల వరకు నివాస ప్రాంతం లేదని తెలిపింది. గ్యాస్ లీక్‌ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపింది. గ్యాస్ లీక్, మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది అన్ని రకాల చర్యలను తీసుకొంటున్నారని పేర్కొంది. గ్యాస్‌ లీక్‌ ఆపేందుకు అంతర్జాతీయ నిపుణులతో సంప్రదింపులు నిర్వహిస్తున్నామని తెలిపింది. ఓఎన్‌జీసీ సీనియర్‌ నిపుణులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని లేఖలో పేర్కొంది.

24 గంటల సమయం

కోనసీమ జిల్లాలో మలికిపురం మండలం ఇరుసుమండలో ఇంకా గ్యాస్ లీకేజీ ఆగలేదు. గ్యాస్ లీకేజీతో మంటలు ఆరలేదని అధికారులు తెలిపారు. ఇరుసుమండ గ్రామం చుట్టూ కిలోమీటర్ల మేర గ్యాస్ వ్యాపించింది. గ్యాస్ లీక్ కాకుండా ఆపేందుకు కనీసం 24 గంటల సమయం పడుతుందని.. గ్యాస్ నిల్వలు అయిపోతేనే మంటలు ఆగుతాయని అధికారులు అంటున్నారు. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు.

Advertisement

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో సోమవారం మధ్యాహ్నం భారీగా గ్యాస్ లీకైంది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఓఎన్జీసీ బావికి రీ డ్రిల్లింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా గ్యాస్ ఎగిసిపడి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతమంతా గ్యాస్ వాసన వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాద భయంతో ఇళ్ల నుంచి దూరంగా పరుగులు తీశారు గ్రామస్థులు.

Also Read: ఇరుసుమండ ఓఎన్‌జీసీ సైట్ లో భారీగా గ్యాస్ లీక్.. ఎగిసిపడుతున్న మంటలు

Advertisement

ఓఎన్జీసీ గ్యాస్‌ లీకేజీని అదుపు చేసేందుకు, మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారని కలెక్టర్ మహేశ్‌ కుమార్‌ తెలిపారు. మలికిపురం ఘటనపై కలెక్టర్ మాట్లాడుతూ.. మంటలు అదుపులోకి వచ్చేందుకు 24 గంటలు ఆగాలన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. అధికారులు, ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిసర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించామని కలెక్టర్ తెలిపారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×