E-Paper
Advertisement

Kotamreddy: వైసీపీ నుంచి పోటీ చెయ్యను.. దానిపై ఆదాల స్పష్టత ఇవ్వాలి: కోటంరెడ్డి

Kotamreddy: వైసీపీ నుంచి పోటీ చెయ్యను.. దానిపై ఆదాల స్పష్టత ఇవ్వాలి: కోటంరెడ్డి
Advertisement

Kotamreddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీ పార్టీల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ కోటంరెడ్డి ఏదోవిధంగా వైసీపీ పార్టీపై ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి.. రానున్న ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేయనని స్పష్టం చేశారు.

తన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని అన్నారు. మేయర్ సహా 11 మంది కార్పోరేటర్లు తనవెంట ఉన్నారని తెలిపారు. పార్టీవైపు వెళ్లినవారు .. రాజకీయంగానే కాదని.. మానసికంగా తనకు దగ్గరగా ఉన్నారని వెల్లడించారు. నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి అని చెబుతున్నారని.. వేల కోట్ల ఆస్తులున్న ఆదాలతో పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాని వెల్లడించారు. తాను ఎవరినీ శత్రువుగా భావించనని.. పోటీ దారుగానే భావిస్తానని చెప్పుకొచ్చారు.

Advertisement

గతంలో మాదిరిగా ఆదాల అన్నిపార్టీలకు తిరగొద్దని సూచించారు. ఏ పార్టీలో ఉంటున్నారో.. ఏ పార్టీ నుంచి పోటీచేయబోతున్నారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ బీఫామ్ జేబులో పెట్టుకొని.. జగన్‌ను కలవడానికి వెళ్లాడని విమర్శించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాశానని తెలిపారు. అలాగే అవకాశం వస్తే నేరుగా కలిసి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.

Tags

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×