E-Paper
Advertisement

Ganja Seized: గుట్టుచప్పుడు కాకుండా.. కంది, మిరప పంటల మధ్య గంజాయి సాగు.. పోలీసులకు డౌట్ రావడంతో…?

Ganja Seized: గుట్టుచప్పుడు కాకుండా.. కంది, మిరప పంటల మధ్య గంజాయి సాగు.. పోలీసులకు డౌట్ రావడంతో…?
Advertisement

Ganja Seized:  కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం డేగులపాడు గ్రామంలో భారీగా సాగు చేస్తున్న గంజాయి తోటను పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని మారుమూల గ్రామంలో దేవాదాయ శాఖకు చెందిన సుమారు 8 ఎకరాల మాన్యం భూమిలో, కంది, మిరప పంటల మధ్య అంతర పంటగా ఈ గంజాయిని సాగు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

డేగులపాడు గ్రామానికి చెందిన ఉనేబాది శివయ్య అనే రైతు గత నాలుగేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ అక్రమ సాగును కొనసాగిస్తున్నాడని తెలిపారు పత్తికొండ డీఎస్పీ వెంకట రామయ్య. స్థానిక కూలీలను పొలం వైపు రాకుండా బెదిరిస్తుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 4.96 కేజీల ఎండు గంజాయితో పాటు, దాదాపు 300 పచ్చి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని ట్రాక్టర్ల ద్వారా తరలించారు.

Advertisement

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాలపై ఈగల్ టీమ్స్ నిఘా పెంచాయని, ఈ భారీ సాగు వెనుక ఎవరెవరు ఉన్నారో కూలంకషంగా విచారణ జరుపుతామని స్పష్టం చేశారు డీఎస్పీ వెంకట రామయ్య. ఈ ఆపరేషన్‌లో సీఐ రవిశంకర్ రెడ్డి, ఎక్సైజ్ సీఐ లలితా దేవి, ఎస్సైలు సతీష్, మన్మధ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ: Pariksha Pe Charcha: పరీక్ష పే చర్చా కోసం అక్షరాల 1.27 కోట్ల రిజిస్ట్రేషన్లు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..?

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×