Shirdi: ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్, ఆయన భార్య బ్రహ్మణితో కలిసి ఆదివారం పుణ్యక్షేత్రం షిర్డీ వెళ్లారు. సోమవారం ఉదయం షిర్డీ సాయిబాబాని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం కాకడ హారతిలో లోకేష్ దంపతులు పాల్గొన్నారు.
షిర్డిలో మంత్రి లోకేష్ దంపతులు
ఆదివారం మంత్రి నారా లోకేష్ సతీ సమేతంగా షిర్డీ వెళ్లారు. సోమవారం ఉదయం సాయి సన్నిధిలో నిర్వహించే కాకడ హారతిలో లోకేష్- బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం షిర్డీకి చేరుకున్న లోకేష్ దంపతులకు కోపర్గావ్ ఎమ్మెల్యే, శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మాజీ చైర్మన్ అశుతోష్ ఆకాశరావు కాలే, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడారు.
షిర్డీలో సాయి బాబా ఆలయంలో సూర్యోదయానికి ముందు 4. 30 గంటలకు మొదటిది కాకడ హారతి ఇస్తారు. రోజులో బాబా నిద్రలేచిన తర్వాత చేసే ప్రార్ధన ఇది. ఈ దర్శనం కోసం చాలామంది భక్తులు ఎగబడతారు. సరిగ్గా సోమవారం దయం కాకడ హారతి లోకేష్ దంపతులు సాయిబాబాని దర్శించుకున్నారు. అక్కడి తెలుగువారితో ఫోటోలు దిగారు.
ఉదయం బాబా దర్శనం, కాకడ హారతికి హాజరు
పూజారులు ఆయనకు ప్రసాదాలు అందజేశారు. బాబా ఆలయంలో వివిధ ప్రాంతాలను సందర్శించారు. ముఖ్యమైన వాటి గురించి ఆలయ అధికారులు వివరించారు. ఉన్నట్లుండి మంత్రి లోకేష్ పుణ్యక్షేత్రాల దర్శనం వెనుక ఏమైనా విశేషం ఉందా అంటూ ఆరా తీస్తున్నారు. లోకేష్ టూర్లో మంత్రి లోకేశ్ వెంట చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఉన్నారు.
ALSO READ: మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత
షిరిడీ శ్రీసాయినాథుని దర్శించుకునేందుకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సతీ సమేతంగా షిరిడీ చేరుకున్నారు. సోమవారం ఉదయం సాయిసన్నిధిలో నిర్వహించే కాకడ హారతిలో లోకేష్, బ్రాహ్మణి దంపతులు పాల్గొంటారు. షిరిడీ చేరుకున్న లోకేష్ దంపతులకు కోపర్గావ్ ఎమ్మెల్యే, శ్రీసాయిబాబా… pic.twitter.com/G45C667cLp
— Telugu Desam Party (@JaiTDP) January 11, 2026