E-Paper
Advertisement

Heavy Rain Alert: బిగ్ అలర్ట్! దూసుకొస్తున్న తుఫాన్.. భారీ వర్షాలు ఎన్ని రోజులంటే..

Heavy Rain Alert: బిగ్ అలర్ట్! దూసుకొస్తున్న తుఫాన్.. భారీ వర్షాలు ఎన్ని రోజులంటే..
Advertisement

Heavy Rain Alert: అయ్యబాబోయ్.. ఒకవైపు చలి.. మరోవైపు వర్షాలు.. ఇక రాష్ట్రంలోని ప్రజలకు చుక్కలే అంటున్న వాతావరణ అధికారులు.. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా వేగంగా కదులుతోంది. ఇది నేడు తుఫానుగా బలపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. తుఫానుగా రూపాంతరం చెందితే ఓర్ణబ్‌గా నామకరణం చేయనున్నారు. ఈ పేరును బంగ్లాదేశ్‌ సూచించింది.ఇది వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంకలోని పొట్టువి, ట్రింకోమలి మధ్య ఇవాళ రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, గంటకు 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. అంతేకాకుండా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు.

ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్..

Advertisement

అలాగే దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం ఈ తుఫాను కారణంగా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తమిళనాడు తీర ప్రాంతాల్లో నేడు, రేపు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తాలోని నెల్లూరు, తిరుపతి జిల్లాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు కూడా వీస్తాయని అంచనా వేస్తున్నారు.

పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. పెరుగుతున్న చలి
ఏపీలో తుఫాను ప్రభావం ఒకవైపు ఉంటే, రాష్ట్రంలో చలి తీవ్రత కూడా క్రమంగా పెరుగుతోంది. ఉత్తర భారతం నుండి వీస్తున్న పొడి గాలుల వల్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైన అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోవడంతో ప్రజలు గడ్డకట్టే చలితో ఇబ్బందులు పడుతున్నారు. విశాఖపట్నం, కడప, అనంతపురం వంటి నగరాల్లో కూడా గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గడంతో పగటిపూట కూడా చలి వాతావరణం కనిపిస్తోంది.

Advertisement

పొగమంచు హెచ్చరికలు..
అలాగే రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఉదయం వేళల్లో విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు. దీనివల్ల జాతీయ రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రయాణికులు ఫాగ్ లైట్లను వాడుతూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Also Read: రణరంగమైన ఇరాన్.. నిరసన జ్వాలల్లో టెహ్రాన్!

జాగ్రత్తలు..
మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వృద్ధులు, చిన్నపిల్లలు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో చలి నుండి రక్షణ పొందడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తుఫాను హెచ్చరికలు ఉన్న జిల్లాల్లో రైతులు తమ పంట కోతలను వాయిదా వేసుకోవాలని లేదా జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలని అధికారులు కోరారు. రాబోయే 48 గంటలు వాతావరణంలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×