E-Paper
Advertisement

Michaung Cyclone : దూసుకొస్తున్న తుపాన్.. తీరం ఎక్కడ దాటుతుందంటే?

Michaung Cyclone : దూసుకొస్తున్న తుపాన్.. తీరం ఎక్కడ దాటుతుందంటే?
Advertisement

Michaung Cyclone : మిగ్ జాం తుపాను తీరానికి దూసుకొస్తోంది. మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. తుపాను బాపట్ల సమీపంలో తీరాన్ని దాటుతుందని ఐఎండీ ప్రకటించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర తీరానికి సమాంతరంగానే కదులుతోంది. తీవ్ర తుపానులో కొంతభాగం సముద్రంలో ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. తీవ్ర తుపానులో మరికొంత భాగం భూమిపై ఉందని పేర్కొంది. తీరానికి అత్యంత దగ్గరగా తీవ్ర తుపాను కదులుతోందని ప్రకటించింది. తుపాను కేంద్రకంలోని మేఘాలు భూభాగంపై ఉన్నాయని తెలిపింది.

గత 6 గంటలుగా గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా తీవ్ర తుపాను పయనిస్తోందని పేర్కొంది. ప్రస్తుతం తీరప్రాంతంలో గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మిగ్‌జాం తుపానుతో పంటలు దెబ్బతిన్నాయి. వైఎస్ఆర్ జిల్లా కలసపాడు మండలంలో కోత‌ దశలో ఉన్న వరి పంట దెబ్బతింది.

Advertisement

తుపాను కారణంగా విశాఖ ఎయిర్ పోర్టు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. 23 సర్వీసులను ఇండిగో నిలిపివేసింది. కానీ విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో ఆపరేషన్‌లో ఉంచుతున్నామని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ తెలిపారు. అత్యవసర సర్వీసులు, మళ్లింపు కోసం ఏటీసీ 24 గంటలూ పని చేస్తుందన్నారు. రన్‌వే నవీకరణ పనుల వల్ల రాత్రి 8 గంటల వరకే విమానాశ్రయంలో రాకపోకలు అనుమతి ఇస్తున్నామని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ వెల్లడించారు.

విజయవాడ బీఆర్‌టీఎస్‌ రోడ్డు భానునగర్‌లో భారీ ఈదురుగాలుల ధాటికి పరంజ కూలింది. బిల్డింగ్‌ ప్లాస్టింగ్‌ సపోర్టింగ్‌ కోసం కట్టిన పరంజ పడిపోయింది. ఐదంతస్తుల పైనుంచి ఇనుపరాడ్లు జారిపడ్డాయి. దీంతో ఒక గృహం పూర్తిగా
5 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నారు. ఆ సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×