E-Paper
Advertisement

స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులతో మంత్రి లోకేష్.. వామపక్షాల నేతల వ్యాఖ్యలపై అసహనం

స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులతో మంత్రి లోకేష్.. వామపక్షాల నేతల వ్యాఖ్యలపై అసహనం

Visakha: విశాఖ కేజీహెచ్‌లో స్టీల్‌ప్లాంట్ బాధిత కుటుంబాలను మంత్రులు లోకేశ్, అనిత, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ పరామర్శించారు.ఈ సందర్భంగా వారితో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు మంత్రి లోకేష్.

స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులతో మంత్రులు లోకేష్, అనిత, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ

విశాఖలోని స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులతో మంగళవారం ఉదయం మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. కిమ్స్, సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలను పరామర్శించారు మంత్రులు లోకేష్, అనిత, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ. ధైర్యంగా ఉండాలని మృతుల కుటుంబాలను ఓదార్చారు.  ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సూరిబాబు, పైడిరాజు, శ్రీనివాసులను పరామర్శించారు.

ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచన చేశారు. ప్రభుత్వ పరంగా అన్నివిధాలుగా బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అందరు కలిసి కాపాడుకోవడం వల్ల స్టీల్ ప్లాంట్‌ను కాపాడు కోగలిగామని అన్నారు. ప్రమాదంపై కమిటీ నివేదిక తర్వాత తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

కార్మికుల సంఘాలతో తీరుపై మంత్రి లోకేష్ అసహనం

అదే సమయంలో వామపక్షాల నేతలు అక్కడికి చేరుకున్నారు. జరిగిన ప్రమాదాలపై మంత్రులను నిలదీసే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో మంత్రి నారా లోకేశ్ అసహనం వ్యక్తంచేశారు. మీ కుటుంబ సభ్యులెవరూ చనిపోలేదు కదా? అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాజకీయాలు చేసేందుకు ఇది సమయం కాదని, చేయాలంటే బయటకు వెళ్లవచ్చన్నారు.

స్టీల్‌ప్లాంట్ ఘటనలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు వామపక్ష నేతలు. వారికి సర్ది చెప్పారు మంత్రి నారా లోకేష్. తాము కేవలం డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదన్నారు. బాధిత కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటామని స్పష్టం చేశారు.

మరోవైపు స్టీల్ ప్లాంట్ ఘటనలో ముగ్గురు మృతదేహాలను గుర్తించారు డాక్టర్లు. వారిలో భానుకుమార్, రమణ, అప్పలరాజు మృతదేహాలు ఉన్నారు. మిగిలినవారి మృతదేహాల గుర్తింపు కోసం కేజీహెచ్‌లో డీఎన్ఏ పరీక్షలు పూర్తి చేశారు. మృతదేహాలు గుర్తు పట్ట లేనంత విధంగా ఉన్నాయి. ఆయా పరీక్షల కోసం బాధిత కుటుంబాల నుంచి నమూనాల సేకరించారు అధికారులు.

ALSO READ: 96 ఏళ్ల నిరీక్షణకు ఫలితం.. వీరాభిమాని కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు, 10 నిమిషాల సేపు

 

Related News

వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులకు రూ.కోటి ఇవ్వాల్సిందే.. లేదంటే ఉద్యమమే.. కేఏ పాల్ హెచ్చరిక!

96 ఏళ్ల నిరీక్షణకు ఫలితం.. వీరాభిమాని కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు, 10 నిమిషాల సేపు

స్టీల్‌ప్లాంట్ ఘటన.. తిరుపతి కూటమి సభ వాయిదా, విశాఖకు డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్

విశాఖ స్టీల్‌ప్లాంట్ ఘటనలో కొత్త విషయాలు..కార్మికులపై 1500 డిగ్రీల వేడి మెటల్, కేంద్రమంత్రి ఎక్స్ గ్రేషియా

తిరుమలలో మళ్లీ బయటపడ్డ భద్రతా వైఫల్యం.. మొబైల్ వీడియోతో భక్తుడి హల్‌చల్!

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి!

సొంత బాబాయ్‌ని హతమార్చి.. ఆ నింద నాపై నెట్టారు.. సీఎం చంద్రబాబు

Big Stories

×