E-Paper
Advertisement

AP Council Session-2026: మండలిలో ఇరుకునపడ్డ వైసీపీ.. ఆ పాయింట్ పట్టుకుని ఏకేసిన మంత్రి లోకేష్

AP Council Session-2026: మండలిలో ఇరుకునపడ్డ వైసీపీ.. ఆ పాయింట్ పట్టుకుని ఏకేసిన మంత్రి లోకేష్
Advertisement

AP Council Session-2026: మండలిలో ఏదో ఒక పాయింట్ విషయంలో అధికార ప్రభుత్వానికి వైసీపీ సభ్యులు అడ్డంగా దొరికిపోతున్నారు. శుక్రవారం అంగన్‌వాడీ ఉద్యోగుల ధర్నాపై అధికార – విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ క్రమంలో మంత్రి లోకేష్ లేవనెత్తిన పాయింట్‌తో వైసీపీ సభ్యులు ఇరుకునపడ్డారు.

మండలిలో అధికార ప్రభుత్వానికి దొరికిపోయిన వైసీపీ సభ్యులు

Advertisement

శుక్రవారం ఉదయం మండలి సమావేశాలు ప్రారంభం కాగానే అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రస్తావించారు. ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్ అని అన్నారు. అంగన్‌వాడీ ఉద్యోగులకు జీతాలు పెంచుతామని ఆనాడు చెప్పామన్నారు. మూడు నెలలు ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా పెంచుతామని హామీ ఇచ్చామన్నారు. మిగతా విషయాలు ఆ రోజు పూర్తి చేశామన్నారు.

వేలాది మంది ఉద్యోగులు ధర్నా చేస్తున్నారని, వారిని వెళ్లి అడగాలన్నారు. మంత్రి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, ధర్నా చేస్తున్న ఉద్యోగులకు న్యాయం చేస్తారా? చేయరా? అంటూ ప్రశ్నించారు. ఆనాడు జరిగిన అగ్రిమెంట్‌ని కొనసాగిస్తారా? లేదా? అడిగారు. అగ్రిమెంట్ లేదని ప్రభుత్వం చెప్పడంతో తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

ఆ పాయింట్ పట్టుకుని ఏకేసిన మంత్రి లోకేష్

వెంటనే మంత్రి లోకేష్ జోక్యం చేసుకున్నారు. వైసీపీ సభ్యులు వెనకాల తలుపు నుంచి వాకౌట్ చేస్తున్నారని సభ దృష్టికి తెచ్చారు సదరు మంత్రి. వారు వాకౌట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ సమాధానాలు వినడానికి సభ్యులకు ఓపిక ఉండాలన్నారు. ప్రభుత్వం కంటిన్యూ ప్రాసెస్ అని ప్రతిపక్ష నేత బొత్స అన్నారని వివరించారు.

అమరావతి పనులు ఎందుకు ఆపారని ప్రశ్నించారు మంత్రి లోకేష్. అన్న క్యాంటీన్లు ఎందుకు మూసి వేశారంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు. ఈ ప్రభుత్వం అన్నిసంఘాలతో చర్చించడానికి రెడీ ఉందన్నారు. సమస్యలను వినడానికి సిద్ధంగా ఉందన్నారు. మేము కన్వీన్స్ చేస్తామని, లేకుంటే మీరైనా మమ్మల్ని కన్వీస్ చేయాలన్నారు. ఇది మన రాష్ట్రమని, కలిసికట్టుగా ముందుకు వెళ్లాలన్నారు.

ALSO READ:  తిరుమల కొండల్లో అగ్నిప్రమాదం..  రంగంలోకి దిగిన ఫైర్ ఇంజన్లు

ఇది ప్రజా ప్రభుత్వమని, పరదాలు కట్టుకుని తిరగలేదన్నారు. విద్యాశాఖ, మిగతా శాఖల్లో ప్రతీ వారం ఒక పూట కచ్చితంగా అన్నిసంఘాలను కమిషనర్ కలవాలన్నారు. వారి సమస్యలు తెలుసుకోవాలన్నారు. ఎన్ని పరిష్కరించాము.. ఇంకా పెండింగ్ ఎన్ని ఉన్నాయి? అందులో పాలసీ సమస్యలు ఎన్ని ఉన్నాయి? చివరకు ఫైనాన్సియల్ సమస్యలపై రివ్యూ చేస్తున్నామని చెప్పారు మంత్రి లోకేష్.

 

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×