E-Paper
Advertisement

Visakhapatnam: క్యాప్ జెమిని సీఈవో ఐమాన్‌తో మంత్రి లోకేష్ భేటీ, రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చ

Visakhapatnam: క్యాప్ జెమిని సీఈవో ఐమాన్‌తో మంత్రి లోకేష్ భేటీ, రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చ
Advertisement

Visakhapatnam: పెట్టుబడులకు విశాఖ అనుకూలంగా ఉందన్నారు మంత్రి లోకేష్. ఈ ప్రాంతంలో గూగుల్ వంటి సంస్థలు డేటా సెంటర్లు పెడుతున్నాయని చెప్పారు. గురువారం విశాఖ వేదికగా క్యాప్ జెమిని గ్లోబల్ సీఈవో ఐమాన్‌తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఇరువురు మధ్య పెట్టుబడుల గురించి చర్చించారు.

క్యాప్ జెమిని సీఈవో ఐమాన్‌తో మంత్రి లోకేష్ భేటీ

Advertisement

ముఖ్యంగా విశాఖలో క్యాప్ జెమినీ సంస్థ ఏర్పాటుపై కూడా చర్చ జరిగింది. మధురవాడ ఐటీ పార్కులో 20 ఎకరాల భూమిని ఈ సంస్థ కోసం పరిశీలన చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ ప్రతినిధులు అడవివరం, ఆనందపురం ప్రాంతాల్లోని భూములను పరిశీలించారు కూడా. అయితే తాత్కాలిక కార్యకలాపాలకు సెంట్రల్ పార్కులోని ఓ భవానాన్ని ఎంపిక చేశారు.

సీఎం చంద్రబాబు నాయకత్వంలో విశాఖలో ఐటీ, డేటా సెంటర్ హబ్‌గా అభివృద్ధి చెందుతోందన్నారు. దేశంలో అతి పెద్ద గూగుల్ డేటా సెంటర్ పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే కాగ్నిజెంట్, టీసీఎస్ లాంటి సంస్థలు విశాఖలో ల్యాండ్ అయ్యాయని గుర్తు చేశారు. మరో మూడునెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం  ప్రారంభం కాబోతోందన్నారు.

Advertisement

రాష్ట్రంలో పెట్టుబడులపై ఇరువురు మధ్య కీలక చర్చ

దేశంలో మరే ప్రాంతంలోని లేని ఐటీ ఎకో సిస్టమ్ విశాఖకు ఉందన్నారు. అన్నివిధాల అనుకూలతలు కలిగిన విశాఖలో 20వేల ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం గల ఐటీ డెవలప్ సెంటర్, జీసీసీ, క్లౌడ్ సర్వీసెస్, బీపిఎం వర్టికల్స్ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్స్ ఏర్పాటు కోసం ఏపీ విశ్వవిద్యాలయాలతో కలిసి కో-డెవలప్ మెంట్ పార్టనర్‌గా వ్యవహరించాలని పేర్కొన్నారు.

క్యాప్ జెమిని డెడికేటెడ్ క్వాంటం వర్టికల్‌ను స్థాపించడమేగాక ఆప్టిమైజేషన్, ఫైనాన్సియల్ సర్సీసెస్, సస్టయినబిలిటీ వంటి రంగాల్లో కస్టమర్ సేవల అభివృద్ధికి ప్రపంచస్థాయి సాంకేతిక భాగస్వాములతో కలిసి పని చేయాలన్నారు.  రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ అభివృద్ధికి సహకారం అందించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో క్యాప్ జెమినీ ఇండియా సీఈవో సంజయ్ చాకే, డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సీఈవో కేశవ్ మురుగేష్ కూడా ఉన్నారు.

ALSO READ: పార్టీ ఆవిర్భావ వేడుకలు.. జగన్ కీలక వ్యాఖ్యలు, దేశ రాజకీయాల్లో వైసీపీ మార్క్

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×