E-Paper
Advertisement

Visakhapatnam: క్యాప్ జెమిని సీఈవో ఐమాన్‌తో మంత్రి లోకేష్ భేటీ, రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చ

Visakhapatnam: క్యాప్ జెమిని సీఈవో ఐమాన్‌తో మంత్రి లోకేష్ భేటీ, రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చ
Advertisement

Visakhapatnam: పెట్టుబడులకు విశాఖ అనుకూలంగా ఉందన్నారు మంత్రి లోకేష్. ఈ ప్రాంతంలో గూగుల్ వంటి సంస్థలు డేటా సెంటర్లు పెడుతున్నాయని చెప్పారు. గురువారం విశాఖ వేదికగా క్యాప్ జెమిని గ్లోబల్ సీఈవో ఐమాన్‌తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఇరువురు మధ్య పెట్టుబడుల గురించి చర్చించారు.

క్యాప్ జెమిని సీఈవో ఐమాన్‌తో మంత్రి లోకేష్ భేటీ

Advertisement

ముఖ్యంగా విశాఖలో క్యాప్ జెమినీ సంస్థ ఏర్పాటుపై కూడా చర్చ జరిగింది. మధురవాడ ఐటీ పార్కులో 20 ఎకరాల భూమిని ఈ సంస్థ కోసం పరిశీలన చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ ప్రతినిధులు అడవివరం, ఆనందపురం ప్రాంతాల్లోని భూములను పరిశీలించారు కూడా. అయితే తాత్కాలిక కార్యకలాపాలకు సెంట్రల్ పార్కులోని ఓ భవానాన్ని ఎంపిక చేశారు.

సీఎం చంద్రబాబు నాయకత్వంలో విశాఖలో ఐటీ, డేటా సెంటర్ హబ్‌గా అభివృద్ధి చెందుతోందన్నారు. దేశంలో అతి పెద్ద గూగుల్ డేటా సెంటర్ పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే కాగ్నిజెంట్, టీసీఎస్ లాంటి సంస్థలు విశాఖలో ల్యాండ్ అయ్యాయని గుర్తు చేశారు. మరో మూడునెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం  ప్రారంభం కాబోతోందన్నారు.

Advertisement

రాష్ట్రంలో పెట్టుబడులపై ఇరువురు మధ్య కీలక చర్చ

దేశంలో మరే ప్రాంతంలోని లేని ఐటీ ఎకో సిస్టమ్ విశాఖకు ఉందన్నారు. అన్నివిధాల అనుకూలతలు కలిగిన విశాఖలో 20వేల ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం గల ఐటీ డెవలప్ సెంటర్, జీసీసీ, క్లౌడ్ సర్వీసెస్, బీపిఎం వర్టికల్స్ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్స్ ఏర్పాటు కోసం ఏపీ విశ్వవిద్యాలయాలతో కలిసి కో-డెవలప్ మెంట్ పార్టనర్‌గా వ్యవహరించాలని పేర్కొన్నారు.

క్యాప్ జెమిని డెడికేటెడ్ క్వాంటం వర్టికల్‌ను స్థాపించడమేగాక ఆప్టిమైజేషన్, ఫైనాన్సియల్ సర్సీసెస్, సస్టయినబిలిటీ వంటి రంగాల్లో కస్టమర్ సేవల అభివృద్ధికి ప్రపంచస్థాయి సాంకేతిక భాగస్వాములతో కలిసి పని చేయాలన్నారు.  రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ అభివృద్ధికి సహకారం అందించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో క్యాప్ జెమినీ ఇండియా సీఈవో సంజయ్ చాకే, డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సీఈవో కేశవ్ మురుగేష్ కూడా ఉన్నారు.

ALSO READ: పార్టీ ఆవిర్భావ వేడుకలు.. జగన్ కీలక వ్యాఖ్యలు, దేశ రాజకీయాల్లో వైసీపీ మార్క్

 

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×