E-Paper
Advertisement

Minister Ram Prasad Reddy: చంద్రబాబు ముందు కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్.. రాయచోటి ప్రజలకు క్షమాపణలు

Minister Ram Prasad Reddy: చంద్రబాబు ముందు కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్.. రాయచోటి ప్రజలకు క్షమాపణలు

Minster Ram Prasad Reddy: ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి మార్పుపై ఆయన ఆవేదన చెందారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మార్చారు. దీంతో మంత్రి రాంప్రసాద్‌ కన్నీళ్లు పెట్టుకోవడంతో.. సీఎం చంద్రబాబు ఆయనను ఓదార్చారు. జిల్లా కేంద్రం మార్చకపోతే వచ్చే సాంకేతికపరమైన ఇబ్బందులను మంత్రికి వివరించారు. రాయచోటి అభివృద్ధి విషయాన్ని తాను చూసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాంప్రసాద్‌ రెడ్డి ప్రస్తుతం రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

నాకు చాలా బాధగా ఉంది

“కళ్ల ముందే కడప జిల్లాను 3 ముక్కలు చేయడం చాలా బాధగా ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల కేబినెట్ లో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటికి బదులుగా మదనపల్లెను చేశారు. గెజిట్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి రాయచోటి ప్రజల మనోభావాలను కేబినెట్ ఉపసంఘానికి, సీఎం చంద్రబాబుకు తెలియజేశాను. కోడూరు నియోజకవర్గం ప్రజలు తిరుపతి జిల్లాలో కలపాలని కోరారు. రాజంపేట నియోజకవర్గం వాళ్లు కడప జిల్లాలో కలపాలని కోరడం… నాకు బాధ కలిగించింది.

కేబినెట్ తర్వాత కూడా సీఎం చంద్రబాబు పిలిపించినప్పుడు కూడా.. ఇదే చెప్పాను. రాయచోటి ప్రజల అభీష్టం మేరకు.. జిల్లా కేంద్రాన్ని తరలించొద్దని కోరాను. కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. కొన్ని అనివార్య కారణాలు, నియోజకవర్గాల ప్రజల సూచనలు, ఇతర సాంకేతిక కారణాలతో అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చారు. నాకు బాధాకరంగా ఉంది. రాయచోటిపై సీఎంకు చిత్తశుద్ధి ఉంది. అందుకే మొదటిసారి ఎమ్మెల్యే అయిన రాంప్రసాద్ రెడ్డికి కేబినెట్ స్థానం కల్పించారు. మేం బాధలో ఉంటే కొంత మంది వక్రీకరిస్తున్నారు” –మంత్రి రాంప్రసాద్ రెడ్డి 

రాయచోటి ప్రజలకు క్షమాపణలు

“జగన్ మోహాన్ రెడ్డి జిల్లాల విభజన చేసినప్పుడు ఇతర జిల్లాల ప్రజలు ఇదే తరహాలో ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో ఇలాగా ప్రచారం చేశారా? అని వక్రీకరిస్తున్న మీడియాలను ప్రశ్నిస్తున్నాను. ఒకరు బాధలో ఉంటే ఓదార్చకుండా.. జటిలం చేయాలని చేస్తున్నారు. నాకు మంత్రి పదవి కంటే రాయచోటి నియోజకవర్గమే ముఖ్యం. నా తండ్రి, సోదరుడిని రెండేసి పర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలిపించిన నియోజకవర్గం. 30 ఏళ్ల తర్వాత కూడా రాయచోటిలో టీడీపీ గెలిపించారు. ఇంకా నాకు ఆశ ఉంది. రాయచోటి ప్రజలకు క్షమాపణలు చెబుతున్నాను. ఎప్పటికీ నియోజకవర్గ ప్రజలకు వెన్నంటే ఉంటాను”- మంత్రి రాంప్రసాద్ రెడ్డి 

Also Read: AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×