E-Paper
Advertisement

Kolusu Parthasarathy : తిట్టకపోతే సీటివ్వరా..? వైసీపీ అధిష్టానంపై ఎమ్మెల్యే పార్థసారథి విమర్శలు

Kolusu Parthasarathy : తిట్టకపోతే సీటివ్వరా..? వైసీపీ అధిష్టానంపై ఎమ్మెల్యే పార్థసారథి విమర్శలు
Advertisement

Kolusu Parthasarathy : ఏపీలో మరో రెండు నెలల వ్యవధిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయపార్టీలు అభ్యర్థుల ఎంపికలపై కసరత్తులు చేస్తున్నాయి. వైసీపీ నుంచి మూడు లిస్టులు రాగా.. సిట్టింగులకు ఊహించని షాకులే తగిలాయి. ఇప్పటికే ఆ పార్టీలో అసంతృప్తులు పెరిగాయి. కీలక నేతలకు సీటివ్వకుండా మొండిచేయి చూపడంతో.. సీటు ఆశించిన వారితో పాటు.. వారి అనుచరులు వైసీపీపై గుర్రుగా ఉన్నారు. కొందరు పార్టీ మారే ఆలోచనలో పడ్డారు.

తాజాగా విడుదలైన లిస్టులో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి (kolusu parthasarathy) కి కూడా సీటు లేదని చెప్పకనే చెప్పింది. పెనమలూరు సమన్వయకర్తగా మంత్రి జోగిరమేశ్ (Jogi Ramesh) ను నియమించింది అధిష్టానం. ఈ క్రమంలో కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు చేయకపోవడం, అసభ్య పదజాలం వాడకపోవడమే నా అసమర్థతా? అని ప్రశ్నించారు.

Advertisement

వైసీపీలో బీసీలకు అగ్రతాంబూలం ఇవ్వడమంటే.. నేతి బీరకాయలో నెయ్యి మాదిరిగా ఉంటుందని వ్యంగ్యం ప్రదర్శించారు. పార్టీలో బలహీనవర్గాలకు గుర్తింపు ఉంటుందని గతంలో తానే చెప్పానని, అది తప్పని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదన్నారు. బీసీ, ఎస్సీలు ఎవరికాళ్లపై వారు నిలబడాలని అనుకుంటారని, మరొకరి పెత్తనంపై ఆధారపడాల్సి వస్తే నాలా ఆత్మాభిమానాన్ని చంపుకోరని ఆయన వ్యాఖ్యలు చేశారు.

కాగా.. అధికార వైసీపీకి మరో షాక్ తగలనుంది. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి సాయంత్రం చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈ నెల 21న ఆయన టీడీపీ(TDP) లో చేరనున్నారు. పార్థసారథిని ఆపడం కోసం వైసీపీ చివరి వరకు ప్రయత్నించినా.. అవేవీ ఫలించలేదు. ప్రయత్నాలు బెడిసికొట్టడంతోనే పెనమలూరుకు జోగి రమేష్ ను ఇంచార్జ్ గా నియమించింది. దీంతో ఇక పార్టీలో ఉండేది లేదని పార్థసారథి నిర్ణయించుకున్నారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×