Bigg Boss 9 Promo:బిగ్ బాస్.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా పేరు సొంతం చేసుకున్న ఈ షో తెలుగులో 9వ సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సండే లో భాగంగా 63వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోను నిర్వాహకులు విడుదల చేయగా.. ఇందులో కంటెస్టెంట్స్ తో గేమ్స్ ఆడించి, మంచి ఎంటర్టైన్మెంట్ అందించారు నాగార్జున. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో రీతూతో జాగ్రత్త అంటూ నాగార్జున చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. మరి ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.
తాజాగా 63వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోను రిలీజ్ చేస్తూ.. అందులో సండే ఎంటర్టైన్మెంట్ అంటూ కంటెస్టెంట్స్ తో ఒక ఆట ఆడించారు నాగార్జున..ఇక స్టేజ్ పైకి రాగానే హౌస్ మేట్స్ తో నాగార్జున మాట్లాడుతూ.. నేనొక క్లిప్పు చూపిస్తాను. దాని తర్వాత క్వశ్చన్ అడుగుతాను. ఎవరైతే గంట కొట్టి ఆన్సర్ చెబుతారో వారే విజేత అంటూ ఆట గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు నాగార్జున. ఆ తర్వాత టాస్క్ లో భాగంగా అక్కడ ఒక సాంగ్ ప్లే చేయగా బ్రహ్మానందం ధరించిన స్పెక్స్ కలర్ ఏంటి ? అని అడగగా గోల్డెన్ బ్లాక్ కలర్ అని పవన్ సమాధానం ఇచ్చారు.
ఇక తర్వాత బాబి గర్ల్ అనే పాటను ప్లే చేయగా.. అందులో కిస్సిక్ అని ఎన్నిసార్లు వచ్చింది అని అడిగితే ఆత్రంతో ముందే బెల్ మోగించిన తనూజ సారీ చెప్పేసింది. ఆ తర్వాత కళ్యాణ్ ఆన్సర్ చెప్పి విన్ అయ్యారు. తర్వాత రీతు చౌదరి, ఇమ్మానుయేల్ వచ్చారు. నాగార్జున మాట్లాడుతూ.. చాలా జాగ్రత్తగా ఆడు.. వచ్చింది రీతు చౌదరి అంటూ తెలిపారు. ఇమ్మూ మాట్లాడుతూ నెత్తికేసి కొట్టినా కొడుతుంది సార్ అంటూ చెప్పగా కరెక్ట్ గా చెప్పావంటూ నాగార్జున వత్తాసు పలికారు. తర్వాత పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలోని బొంగరాల లాంటి కళ్ళు తిప్పింది అనే సాంగ్ ప్లే చేయగా ఇందులో ప్రణీత వేసుకున్న గాజుల కలర్ గురించి అడిగారు నాగార్జున. బేబీ పింక్ అంటూ ఆన్సర్ చెప్పి విన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ . అలా మొత్తానికి అయితే తన టాలెంట్ ను నిరూపించుకుంది.
also read:Siva Re Release: చిరంజీవికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ.. పశ్చాతాపడుతున్నాడా?
వరుసగా రీతు చౌదరి టీం విన్ అవుతూ ఉంటే అన్ని చెప్పేస్తున్నారు ఈ టీం తో ఇంకెందుకు గేమ్ కంటిన్యూ చేయడం అని తెలిపారు నాగార్జున. ఇమ్మూ మాత్రం.. లేచి సార్ మేము ఒక్కలమే విన్ అయ్యాం.. మళ్ళీ ఆడతామని అడగగా.. లాస్ట్ ఛాన్స్ ఇచ్చారు నాగార్జున.. డోంట్ మ్యారీ బీ హ్యాపీ అనే పాట ప్లే చేయగా.. ఫ్లాష్ బ్యాక్ లో ఎన్ని టీషర్ట్స్, ఎన్ని క్యారెక్టర్స్ మార్చారు అని పవన్ ముందే గెస్ చేయగా.. ఎన్ని అని అడిగాడు నాగార్జున. సిక్స్ అని చెప్పగా సెవెన్ అని రీతు కరెక్ట్ ఆన్సర్ చెప్పింది అలా రీతు చౌదరి టీం విన్ అయిపోయింది. మొత్తానికైతే ఈ షోలో రీతు చౌదరి గ్రాస్పింగ్ పవర్ కి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.