E-Paper
Advertisement

Rapaka: టీడీపీ రూ. 10 కోట్లు ఆఫర్ చేసింది.. జగన్‌పై నమ్మకంతో తిరస్కరించా.. రాపాక సంచలన వ్యాఖ్యలు

Rapaka: టీడీపీ రూ. 10 కోట్లు ఆఫర్ చేసింది.. జగన్‌పై నమ్మకంతో తిరస్కరించా.. రాపాక సంచలన వ్యాఖ్యలు
Advertisement

Rapaka: ఏపీ ఎమ్యెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఇప్పటికే వైసీపీ అధిష్ఠానం నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను సీఎం జగన్ సస్పెండ్ చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రాస్ ఓటింగ్ చేయాలని టీడీపీ తనను కోరిందని వెల్లడించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయాలని టీడీపీ రూ. 10 కోట్లు ఆఫర్ చేసిందని వరప్రసాద్ తెలిపారు. తన స్నేహితుడు కేఎస్ఎన్ రాజుతో టీడీపీ నేతలు బేరసారాలు జరిపారని చెప్పారు. అసెంబ్లీ దగ్గర కూడా ఉండి ఎమ్మెల్యే రామరాజు టీడీపీకి ఓటేయాలని తనను కోరారన్నారు. టీడీపీకి ఓటేస్తే మంచి భవిష్యత్తుతో పాటు మంచి పొజీషన్ ఇస్తామన్నారని తెలిపారు.

Advertisement

కానీ ముఖ్యమంత్రి జగన్‌పై ఉన్న నమ్మకంతో టీడీపీ ఆఫర్‌ను తిరస్కరించానని రాపాక వెల్లడించారు. ఒకసారి పరువు పోతే సమాజంలో తలెత్తుకొని తిరగలేమన్నారు. సిగ్గు, శరం వదిలేసి ఉంటే రూ. 10 కోట్లు వచ్చేవన్నారు. కానీ తాను అలా చేయలేదని, టీడీపీ ఆఫర్‌ను తిరస్కరించానని వెల్లడించారు.

Related News

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

Big Stories

Advertisement
×