E-Paper
Advertisement

Rapaka: టీడీపీ రూ. 10 కోట్లు ఆఫర్ చేసింది.. జగన్‌పై నమ్మకంతో తిరస్కరించా.. రాపాక సంచలన వ్యాఖ్యలు

Rapaka: టీడీపీ రూ. 10 కోట్లు ఆఫర్ చేసింది.. జగన్‌పై నమ్మకంతో తిరస్కరించా.. రాపాక సంచలన వ్యాఖ్యలు

Rapaka: ఏపీ ఎమ్యెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఇప్పటికే వైసీపీ అధిష్ఠానం నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను సీఎం జగన్ సస్పెండ్ చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రాస్ ఓటింగ్ చేయాలని టీడీపీ తనను కోరిందని వెల్లడించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయాలని టీడీపీ రూ. 10 కోట్లు ఆఫర్ చేసిందని వరప్రసాద్ తెలిపారు. తన స్నేహితుడు కేఎస్ఎన్ రాజుతో టీడీపీ నేతలు బేరసారాలు జరిపారని చెప్పారు. అసెంబ్లీ దగ్గర కూడా ఉండి ఎమ్మెల్యే రామరాజు టీడీపీకి ఓటేయాలని తనను కోరారన్నారు. టీడీపీకి ఓటేస్తే మంచి భవిష్యత్తుతో పాటు మంచి పొజీషన్ ఇస్తామన్నారని తెలిపారు.

కానీ ముఖ్యమంత్రి జగన్‌పై ఉన్న నమ్మకంతో టీడీపీ ఆఫర్‌ను తిరస్కరించానని రాపాక వెల్లడించారు. ఒకసారి పరువు పోతే సమాజంలో తలెత్తుకొని తిరగలేమన్నారు. సిగ్గు, శరం వదిలేసి ఉంటే రూ. 10 కోట్లు వచ్చేవన్నారు. కానీ తాను అలా చేయలేదని, టీడీపీ ఆఫర్‌ను తిరస్కరించానని వెల్లడించారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×