BigTV English
Advertisement

Rapaka: టీడీపీ రూ. 10 కోట్లు ఆఫర్ చేసింది.. జగన్‌పై నమ్మకంతో తిరస్కరించా.. రాపాక సంచలన వ్యాఖ్యలు

Rapaka: టీడీపీ రూ. 10 కోట్లు ఆఫర్ చేసింది.. జగన్‌పై నమ్మకంతో తిరస్కరించా.. రాపాక సంచలన వ్యాఖ్యలు

Rapaka: ఏపీ ఎమ్యెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఇప్పటికే వైసీపీ అధిష్ఠానం నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను సీఎం జగన్ సస్పెండ్ చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రాస్ ఓటింగ్ చేయాలని టీడీపీ తనను కోరిందని వెల్లడించారు.


ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయాలని టీడీపీ రూ. 10 కోట్లు ఆఫర్ చేసిందని వరప్రసాద్ తెలిపారు. తన స్నేహితుడు కేఎస్ఎన్ రాజుతో టీడీపీ నేతలు బేరసారాలు జరిపారని చెప్పారు. అసెంబ్లీ దగ్గర కూడా ఉండి ఎమ్మెల్యే రామరాజు టీడీపీకి ఓటేయాలని తనను కోరారన్నారు. టీడీపీకి ఓటేస్తే మంచి భవిష్యత్తుతో పాటు మంచి పొజీషన్ ఇస్తామన్నారని తెలిపారు.

కానీ ముఖ్యమంత్రి జగన్‌పై ఉన్న నమ్మకంతో టీడీపీ ఆఫర్‌ను తిరస్కరించానని రాపాక వెల్లడించారు. ఒకసారి పరువు పోతే సమాజంలో తలెత్తుకొని తిరగలేమన్నారు. సిగ్గు, శరం వదిలేసి ఉంటే రూ. 10 కోట్లు వచ్చేవన్నారు. కానీ తాను అలా చేయలేదని, టీడీపీ ఆఫర్‌ను తిరస్కరించానని వెల్లడించారు.


Related News

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

Top 20 News @ 9 PM: గ్రోత్ హబ్‌గా విశాఖ, కేటీఆర్‌కి వ్యతిరేఖంగా పోస్టర్స్

Spurious Ghee: కోటి సంతకాల సంగతి దేవుడెరుగు.. ముందు కల్తీ నెయ్యిలోనుంచి బయటపడేదెలా?

CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్.. ఇక తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ మినిస్టర్లదే: సీఎం చంద్రబాబు

AP Cabinet Decisions: రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.. మరిన్ని కీలక నిర్ణయాలు

Top 20 News @ 8 PM: కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు ఆరోపణలు, ఉపాధ్యాయుడు దాడి.. వినికిడి కోల్పోయిన విద్యార్ధి

Top 20 News @ 7 PM: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. త్రిషా ఇంటికి బాంబు బెదిరింపు..!

Big Stories

×