E-Paper
Advertisement

Political News in AP: హిట్ కాంబినేషన్ అనిపించుకున్న బాలినేని, మాగుంట.. ఈ సారి ఎడబాటు తప్పదా..

Political News in AP: హిట్ కాంబినేషన్ అనిపించుకున్న బాలినేని, మాగుంట.. ఈ సారి ఎడబాటు తప్పదా..
Advertisement

MP Magunta Srinivasulu Reddy Vs Balineni Srinivasa Reddy

Advertisement

హిట్ కాంబినేషన్ అనిపించుకున్న బాలినేని, మాగుంట టీడీపీలో చేరిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి
కుమారుడ్ని ఎన్నికల బరిలో దింపుతున్న మాగుంట వైసీపీ టికెట్‌తో మరోసారి పోటీకి సిద్దమైన బాలినేని
2014లో తొలిసారి పరాజయం పాలైన బాలినేని టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిన మాగుంట 3 సార్లు సక్సెస్ అయిన మాగుంట, బాలినేని కాంబినేషన్ ఇద్దరి మధ్య కొనసాగుతూనే ఉన్న స్నేహబంధం వివిధ కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటున్న నేతలు మాగుంట కుమారుడు చరిత్ర తిరగరాస్తారా?

Also Read: అభివృద్ధిని పట్టించుకోని పుష్ఫశ్రీవాణి.. విజయంపై ఎందుకంత ధీమా.

Advertisement

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డిలది విడదీయరాని బంధమనే చెప్పాలి. వారిద్దరూ ఒకే పార్టీ నుంచి పోటీ చేసిన ప్రతిసారి గెలుస్తూ హిట్ కాంబినేషన్ అనిపించుకున్నారు. అయితే ఈ సారి వీరిద్దరి కాంబినేషన్‌కు మరోసారి బ్రేక్ పడింది. వైసీపీ అధ్యక్షుడు జగన్ తీసుకున్న నిర్ణయంతో మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీలో చేరిపోయారు. ఈ సారి ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్ధిగా బరిలో దిగారు. బాలినేని కూడా పార్టీ అధిష్టానంపై అసంత‌ృప్తితో ఉన్నప్పటికీ. గత్యంతరం లేక ఒంగోలు ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి పోటీకి సిద్దమయ్యారు. అలా వారిద్దరి కాంబినేషన్ విడిపోయినా. ఉన్న తమ స్నేహబంధాన్ని మాత్రం వదులుకోక పోతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది

1999 నుంచి ఒంగోలు ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక్క సారి మాత్రమే ఓటమి పాలయ్యారు. 2014లో వైసీపీ నుంచి ఒంగోలు ఎంపీ అభ్యర్ధిగా వైవీ సుబ్బారెడ్డి బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో బాలినేని తొలిసారి ఓటమి మూటగట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో మాగుంట ఒంగోలు ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అంతకు ముందు 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాగుంట, బాలినేని ఇద్దరూ గెలుపొందారు. 2019లోనూ వైసీపీ అభ్యర్ధులుగా వారి కాంబినేషన్‌ ఒంగోలులో హిట్ కొట్టింది.

Also read: సిట్టింగ్ కే సీటు.. పుట్టపర్తిలో పొలిటికల్ హీట్

2014 ఎన్నికల్లో ఓటమికి తమ కాంబినేషన్ మిస్ అవ్వడమే కారణమని భావించిన బాలినేని, మాగుంటలు 2019లో పట్టుబట్టి మరీ టికెట్లు దక్కించుకున్నారు. దాంతో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వారిద్దరికీ తిరుగులేదనే టాక్ రాజకీయ వర్గాల్లో నడిచింది. ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి ఆ ఇద్దరు కలిసి వైసీపీ నుంచే పోటీ చేయాలని భావించినా జగన్ నిర్ణయంతో ఆ జోడీ విడిపోవాల్సి వచ్చింది. మాగుంట స్థానంలో ఎంపీ టికెట్ చెవిరెడ్డి భాస్కరరెడ్డికి కేటాయించడంతో వారి మధ్య రాజకీయ బంధం మళ్లీ తెగిపోయింది .. తన రాజకీయ మిత్రుడు టికెట్ కోసం బాలినేని అధిష్టానం పై ఎంత ఒత్తిడి తెచ్చినా జగన్ మాత్రం మాగుంటకు టికెట్ కేటాయించేందుకు ససేమిరా అనడంతో.. ఒంగోలు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోవాల్సి వచ్చింది ..

తాను పొలిటికల్ రిటైర్‌మెంట్ తీసుకోవడానికి ఫిక్స్ అయిన మాగుంట శ్రీనివాసులరెడ్డి.. ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున తన కుమారుడు రాఘవరెడ్డిని పోటీ లోకి దింపారు .. మాగుంట వెంట బాలినేని నడుస్తారని భావించినా.. బాలినేని మాత్రం వైసీపీ నుంచే ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్దమయ్యారు ..

 

Tags

Related News

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Big Stories

Advertisement
×