E-Paper
Advertisement

Konaseema District: ఇంట్లోకి చొరబడి‌ టెన్త్ విద్యార్థినిని రేప్ చేసిన యువకుడు

Konaseema District: ఇంట్లోకి చొరబడి‌ టెన్త్ విద్యార్థినిని రేప్ చేసిన యువకుడు
Advertisement

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండల కేంద్రంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థినిపై కాలాడి సతీష్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

బాలిక తల్లి పని నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగింది. ఇదే అదనుగా భావించిన ఇంటి సమీపంలో ఉండే కాలాడి సతీష్ అనే యువకుడు బాలికను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

Advertisement

కూతురు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లి తిరిగి ఇంటికి చేరుకుని గాలించగా.. తర్వాత బాలిక లభ్యమైంది. బాలిక వద్ద విషయాలు తెలుసుకున్న తల్లి కన్నీరుమున్నీరైంది. తన కూతురుకు జరిగిన అన్యాయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

వెంటనే బాలిక తల్లి ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన కూతురికి న్యాయం చేయాలని.. నిందితుడు సతీష్‌ను కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను వేడుకుంది.

Advertisement

ఈ ఫిర్యాదు మేరకు ముమ్మిడివరం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు నిందితుడు సతీష్‌ను అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఈ దారుణ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలికకు న్యాయం జరగాలని నిందితుడికి తక్షణమే శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×