E-Paper
Advertisement

NTR District: న్యూ ఇయర్ వేళ యువకుల మధ్య రగడ.. అర్ధరాత్రి కర్రలతో ఫైటింగ్, రంగంలోకి పోలీసులు

NTR District: న్యూ ఇయర్ వేళ యువకుల మధ్య రగడ..  అర్ధరాత్రి కర్రలతో ఫైటింగ్, రంగంలోకి పోలీసులు
Advertisement

NTR District: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ వేళ రగడ మొదలైంది. కేక్ కటింగ్ విషయంలో యువకుల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. ఆ తర్వాత కర్రలతో ఫైటింగ్‌కు దారి తీసింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది?

న్యూ ఇయర్ వేళ యువకుల మధ్య ఫైటింగ్

Advertisement

ఎన్టీఆర్ జిల్లాలో కొత్త సంవత్సర వేడుకలు జరుగుతున్న వేళ యువకుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. జగ్గయ్యపేట పరిధిలోని తొర్ర గుంటపాలెం ప్రాంతంలో కొత్త సంవత్సరం సందర్భంగా కొందరు యువకులు కేక్‌ కట్టింగ్‌‌కు ప్లాన్ చేశారు. షాపు నుంచి కేక్ తీసుకొచ్చి మిడ్ నైట్ కేక్ కట్ చేశారు.

ఆనందంగా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఆ సమయంలో అటువైపు కారులో నలుగురు యువకులు వచ్చారు. నడి రోడ్డుపై సంబరాలు ఏంటని పక్కన నిర్వహించుకోవాలని సూచన చేశారు. తమకు దారి ఇవ్వాలని వారిని కోరారు. కేక్‌ కట్టింగ్‌ తర్వాత కొందరు యువకులు కారు దగ్గరకు వెళ్లారు.

Advertisement

అర్ధరాత్రి కర్రలతో ఫైటింగ్, రంగంలోకి పోలీసులు

ఎట్టి పరిస్థితుల్లో తాము సెలబ్రేషన్స్ రోడ్డుపై చేస్తామని మొండికేశారు. ఈ క్రమంలో రెండు గ్రూపుల యువకుల మధ్య మాటా మాటా పెరిగింది. ఒకరినొకరు తోసేసుకుని ముఖాలపై పిడిగుద్దులు విసురుకున్నారు. ఆ తర్వాత కర్రలతో దాడులకు దిగారు. ఈ దాడిలో కారులో వచ్చిన ఓ యువకుడికి గాయాలు అయ్యాయి. మొత్తమ్మీద ఈ ఘటనలో నలుగురు యువకులు గాయపడ్డారు.

అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గొడవ గురించి ఆరా తీశారు. గాయపడినవారిని స్థానికులు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి సమయంలో యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదని సమాచారం. దీనికి గురించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

ALSO READ: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి.. కోటికిపైగానే స్వాహా

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×