E-Paper
Advertisement

Tirumala News: తిరుమలలో కొత్తజంటకు అదేం పని.. రకరకాల భంగిమల్లో షూట్‌, ఆపై భక్తుల ఆగ్రహం

Tirumala News: తిరుమలలో  కొత్తజంటకు అదేం పని.. రకరకాల భంగిమల్లో షూట్‌, ఆపై భక్తుల ఆగ్రహం
Advertisement

Tirumala News: తిరుమల పేరు చెబితే చాలు మనసంతా పులకరిస్తుంది. ఆ క్షేత్రానికి వెళ్తే అన్నిమరిచిపోతాము. గోవింద నామస్మరణలతో ఏడు కొండలు నిత్యం మార్మోగుతుంటాయి. కానీ కొందరు అవేవీ పట్టించుకోలేదు. ఆధ్మాత్మిక ప్రాంతాన్ని కొందరు భక్తులు అపవిత్రం చేస్తున్నారు. చేతిలో కెమెరాలు పట్టుకుని ఫోటోషూట్ల కోసం ఎగబడుతున్నారు.

తిరుమలను అపవిత్ర చేస్తున్న కొందరు భక్తులు

Advertisement

తాజాగా శ్రీవారి ఆలయ పరిసరాల్లో కొత్త జంట ఫోటో‌షూట్ చేయడం వివాదానికి దారి తీసింది. తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో ఓ కొత్త జంట రెచ్చిపోయింది. పుణ్యక్షేత్రానికి వచ్చామన్న విషయాన్ని మరిచిపోయింది. అక్కడ భక్తులంతా తమ వైపు చూడాలని భావించింది. ఈ క్రమంలో ఫోటోషూట్ చేయడం వివాదానికి కారణమైంది.

గొల్ల మండపం నుండి అఖిలాండం వరకు నిబంధనలకు విరుద్ధంగా ఆ జంట వివిధ భంగిమల్లో ఫోటోలు దిగుతూ షూట్ చేయడం వివాదానికి కేంద్రమైంది. తొలుత భక్తులు దర్శనానికి వెళ్తే ద్వారం వద్ద రకరకాల భంగిమల్లో ఫోటోలు తీసుకున్నారు. ఆ తర్వాత శ్రీవారి పరిసరాల్లో పలు ప్రాంతాలు సందర్శించారు. చివరకు స్వామి ఆలయానికి ఎదురుగా ఫోటోలు, ముద్దులు ఇస్తూ షూట్ చేశారు.

Advertisement

నిషేధం ఉన్నా రెచ్చిపోతున్న కొత్తజంటలు, భక్తులు ఆగ్రహం

తిరుమలలో నిత్యం వందలాది సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. సెక్యూరిటీ కూడా ఓ రేంజ్‌లో ఉంటుంది. వారిని ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. కొత్త జంటల చేసే ఇలాంటి పనుల వల్ల తిరుమలకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని అంటున్నారు. తిరుమలలో కొత్తగా పాలకమండలి వచ్చిన తర్వాత రకరకాల పనులకు శ్రీకారం చుట్టింది.

తిరుమలలో ఫోటో షూట్లు, రీల్స్ చేయడంపై నిషేధం. ఈ మేరకు బోర్డు కూడా ఆమోదించింది. రాజకీయ ప్రసంగాలు చేసే నేతలపై కేసులు నమోదు చేశారు. అక్కడ నిషేధమున్నా భద్రతా సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి చర్యలపై టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు.

ALSO READ: అజ్ఞాతంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. ఫోన్ స్విచ్ఛాఫ్, కమిటీ ముందుకొస్తారా?

 

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×