BigTV English
Advertisement

Dance by 350 artistes: మంత్రాలయంలో మంత్ర ముగ్ధులను చేసిన నాట్యం..అంతర్జాతీయ రికార్డు

Dance by 350 artistes: మంత్రాలయంలో మంత్ర ముగ్ధులను చేసిన నాట్యం..అంతర్జాతీయ రికార్డు

Dance by 350 artistes.. an international record at Mantralayam: ఆదివారం మంత్రాలయంలో జరిగిన భరత నాట్య ప్రదర్శన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం, చెన్నరాయపట్నం హాసన్ కు చెందిన జాతీయ సంప్రదాయ నృత్య అకాడమీ కలిస ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలో 350 మందికి పైగా భరతనాట్య కళాకారిణులు పాల్గొన్నారు. ఈ వేదికపై ఆదివారం సాయంత్రం అందరూ కలిసి ఏక కాలంలో నృత్యాభినయం చేశారు. శ్రీ మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ స్వామీజీ ఆశీస్సులతో ఈ నృత్య ప్రదర్శన ఏర్పాటు కార్యక్రమం జరిగింది. ఈ నాట్య ప్రదర్శనకు ప్రపంచ నలుమూలల నుంచి నాట్య కళాకారిణులు పాల్గొనడం విశేషం. దాదాపు 15 నిమిషాల పాటు రామ నామ గీతాలు ఆలపిస్తూ సాగిన ఈ దృశ్య వేడుక అహూతులను అలరించింది.


వివిధ దేశాలనుంచి..

వివిధ దేశాలనుంచి వచ్చిన కళాకారిణులు భారత శాస్త్రీయ నృత్యాన్ని అత్యంత శ్రద్ధతో చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎక్కడో జర్మనీ, జపాన్, ఇండోనేషియా దేశాలనుంచి ఈ కళాకారులు రావడం విశేషం. మంత్రాలయంలో నిర్వహిస్తున్న 353వ సప్త రాత్రోత్సవాలు శనివారంతో ముగిశాయి. వారంరోజులుగా జరుగుతున్న ఈ ఉత్సవాలనుసర్వ సమర్పణతో ముగింపు పలికారు పీఠాధిపతి.


Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

Big Stories

×