BigTV English

Dance by 350 artistes: మంత్రాలయంలో మంత్ర ముగ్ధులను చేసిన నాట్యం..అంతర్జాతీయ రికార్డు

Dance by 350 artistes: మంత్రాలయంలో మంత్ర ముగ్ధులను చేసిన నాట్యం..అంతర్జాతీయ రికార్డు

Dance by 350 artistes.. an international record at Mantralayam: ఆదివారం మంత్రాలయంలో జరిగిన భరత నాట్య ప్రదర్శన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం, చెన్నరాయపట్నం హాసన్ కు చెందిన జాతీయ సంప్రదాయ నృత్య అకాడమీ కలిస ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలో 350 మందికి పైగా భరతనాట్య కళాకారిణులు పాల్గొన్నారు. ఈ వేదికపై ఆదివారం సాయంత్రం అందరూ కలిసి ఏక కాలంలో నృత్యాభినయం చేశారు. శ్రీ మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ స్వామీజీ ఆశీస్సులతో ఈ నృత్య ప్రదర్శన ఏర్పాటు కార్యక్రమం జరిగింది. ఈ నాట్య ప్రదర్శనకు ప్రపంచ నలుమూలల నుంచి నాట్య కళాకారిణులు పాల్గొనడం విశేషం. దాదాపు 15 నిమిషాల పాటు రామ నామ గీతాలు ఆలపిస్తూ సాగిన ఈ దృశ్య వేడుక అహూతులను అలరించింది.


వివిధ దేశాలనుంచి..

వివిధ దేశాలనుంచి వచ్చిన కళాకారిణులు భారత శాస్త్రీయ నృత్యాన్ని అత్యంత శ్రద్ధతో చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎక్కడో జర్మనీ, జపాన్, ఇండోనేషియా దేశాలనుంచి ఈ కళాకారులు రావడం విశేషం. మంత్రాలయంలో నిర్వహిస్తున్న 353వ సప్త రాత్రోత్సవాలు శనివారంతో ముగిశాయి. వారంరోజులుగా జరుగుతున్న ఈ ఉత్సవాలనుసర్వ సమర్పణతో ముగింపు పలికారు పీఠాధిపతి.


Related News

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Jagan Assembly: ఈ మాస్ ర్యాగింగ్ ని జగన్ తట్టుకోగలరా? వైసీపీ వ్యూహం ఏంటి?

Dasara 2025: దసరా సంబరాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు

Vijayawada Durga Festival: 10,000 సీసీ కెమెరాలతో.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు భారీ బందోబస్తు

Big Stories

×