BigTV English
Advertisement

Key Orders: అనుమతి లేకుండా సచివాలయం నుంచి ఏం తీసుకెళ్లొద్దు: జీఏడీ

Key Orders: అనుమతి లేకుండా సచివాలయం నుంచి ఏం తీసుకెళ్లొద్దు: జీఏడీ

Key Orders of AP GAD: సాధారణ పరిపాలన శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లను స్వాధీనం చేసుకుంటామని కార్యాలయ సిబ్బందికి సూచించింది. సచివాలయం నుంచి తమ అనుమతి లేకుండా ఎటువంటి పత్రాలు కానీ, వస్తువులు కానీ బయటకు తీసుకెళ్లొద్దంటూ ఆ ఆదేశాల్లో జీఏడీ పేర్కొన్నది.


ప్రత్యేకించి మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖల్లోని దస్త్రాలు, కాగితాలను తరలించేందుకు వీలు లేదంటూ అందులో స్పష్టం చేసింది. అదేవిధంగా వాహనాల తనిఖీలు నిర్వహించాల్సిందిగా సచివాలయ భద్రతను చూసే ఎస్పీఎఫ్ సిబ్బందిని ఆదేశించింది. జూన్ 3న మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని తెలిపింది.

మరోవైపు, రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా పలు సూచనలు చేశారు. ఫలితాలు తరువాత ఎలాంటి ర్యాలీలు తీయొద్దని చెప్పారు. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ఎవరైనా గొడవలు సృష్టిస్తే వెంటనే వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. కేంద్ర బలగాలతో కౌంటింగ్ కేంద్రాల వద్ద పర్యవేక్షణ ఉంటుందని తెలిపిన విషయం తెలిసిందే.


Also Read: ఫలితాల తర్వాత ర్యాలీలు తీయొద్దు: సీఈఓ

ఇంకో విషయమేమంటే.. తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటితో ఐదేళ్లు పూర్తయిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మరోసారి కూడా తామే అధికారంలోకి రాబోతున్నాం.. మంచి పాలనను కంటిన్యూ చేస్తాం అంటూ జగన్ మోహన్ రెడ్డి ఆ పోస్ట్ లో పేర్కొన్న విషయం తెలిసిందే.

Tags

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×