E-Paper
Advertisement

Key Orders: అనుమతి లేకుండా సచివాలయం నుంచి ఏం తీసుకెళ్లొద్దు: జీఏడీ

Key Orders: అనుమతి లేకుండా సచివాలయం నుంచి ఏం తీసుకెళ్లొద్దు: జీఏడీ
Advertisement

Key Orders of AP GAD: సాధారణ పరిపాలన శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లను స్వాధీనం చేసుకుంటామని కార్యాలయ సిబ్బందికి సూచించింది. సచివాలయం నుంచి తమ అనుమతి లేకుండా ఎటువంటి పత్రాలు కానీ, వస్తువులు కానీ బయటకు తీసుకెళ్లొద్దంటూ ఆ ఆదేశాల్లో జీఏడీ పేర్కొన్నది.

ప్రత్యేకించి మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖల్లోని దస్త్రాలు, కాగితాలను తరలించేందుకు వీలు లేదంటూ అందులో స్పష్టం చేసింది. అదేవిధంగా వాహనాల తనిఖీలు నిర్వహించాల్సిందిగా సచివాలయ భద్రతను చూసే ఎస్పీఎఫ్ సిబ్బందిని ఆదేశించింది. జూన్ 3న మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని తెలిపింది.

Advertisement

మరోవైపు, రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా పలు సూచనలు చేశారు. ఫలితాలు తరువాత ఎలాంటి ర్యాలీలు తీయొద్దని చెప్పారు. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ఎవరైనా గొడవలు సృష్టిస్తే వెంటనే వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. కేంద్ర బలగాలతో కౌంటింగ్ కేంద్రాల వద్ద పర్యవేక్షణ ఉంటుందని తెలిపిన విషయం తెలిసిందే.

Also Read: ఫలితాల తర్వాత ర్యాలీలు తీయొద్దు: సీఈఓ

Advertisement

ఇంకో విషయమేమంటే.. తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటితో ఐదేళ్లు పూర్తయిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మరోసారి కూడా తామే అధికారంలోకి రాబోతున్నాం.. మంచి పాలనను కంటిన్యూ చేస్తాం అంటూ జగన్ మోహన్ రెడ్డి ఆ పోస్ట్ లో పేర్కొన్న విషయం తెలిసిందే.

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×