E-Paper
Advertisement

Maredumilli: హిడ్మా ఎన్‌కౌంటర్ రచ్చ.. మారేడుమిల్లిలో ఓయూ విద్యార్థులు అరెస్ట్

Maredumilli: హిడ్మా ఎన్‌కౌంటర్ రచ్చ.. మారేడుమిల్లిలో ఓయూ విద్యార్థులు అరెస్ట్
Advertisement

Maredumilli: ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన దాదాపు 14 మంది విద్యార్థుల బృందం ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం పరిధిలో గల మారేడుమిల్లి ప్రాంతానికి చేరుకున్నారు. ఈ ప్రాంతంలో ఇటీవల హిడ్మా ఎన్‌కౌంటర్ జరిగిన నేపథ్యంలో, దానిపై నిజ నిర్ధారణ చేసే ఉద్దేశంతో విద్యార్థులు ఆ ప్రాంతాలను పరిశీలించడానికి ప్రయత్నించారు.

అల్లూరి జిల్లాలో ఓయూ విద్యార్థులు పోలీస్ స్టేషన్‌కు తరలింపు..
కానీ విద్యార్థులు చింతూరు ప్రాంతానికి చేరుకోగానే పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. చింతూరులో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు ఆ విద్యార్థుల బృందాన్ని అరెస్టు చేసి, చింతూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టు సమయంలో విద్యార్థులు “మావోయిస్టులు మాకొద్దు” అంటూ నినాదాలు చేశారు.

Advertisement

బస్టాండ్ వద్ద దిష్టిబొమ్మ దహనం చేసే కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు..
అంతేకాకుండా అరెస్టుకు ముందు, విద్యార్థులు బస్టాండ్ వద్ద దిష్టిబొమ్మ దహనం చేసే కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రయత్నించారు. అయితే, చింతూరు పోలీసులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం సున్నితమైనది కావడంతో, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

అలాగే ఎన్‌కౌంటర్ ప్రాంతాలను సందర్శించడానికి వెళ్లిన విశ్వవిద్యాలయాల విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా నిర్బంధించడం సరికాదని విద్యార్థి సంఘాలు, ఇతర పౌర సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

Advertisement

నిజనిర్ధారణకు వెళ్లిన విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం నేరం..
ఈ రోజు (శుక్రవారం) ఉదయం 8 గంటల సమయంలో విద్యార్థుల బృందాన్ని అరెస్టు చేసి, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. రాజ్యాంగబద్ధంగా నిజనిర్ధారణకు వెళ్లిన విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని విమర్శించారు.

Also Read: దిత్వా తుఫాన్ ఎఫెక్ట్! నెల్లూరులో దంచికొడుతున్న వర్షాలు.. వేలాది ఎకరాల్లో పంట నష్టం.. 

అరెస్ట్ చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్..
అరెస్టు చేసిన విద్యార్థులను పోలీసులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, నిజనిర్ధారణ చేసుకోవడానికి విద్యార్థులకు అవకాశం కల్పించాలని కూడా వారు కోరారు. ఎన్‌కౌంటర్ ఘటనపై వాస్తవాలను తెలుసుకునే హక్కు పౌర సమాజానికి, విద్యార్థులకు ఉందని వారు వాదిస్తున్నారు.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×