BigTV English
Advertisement

Palnadu: జీతాలు చెల్లించండి.. పంచాయతీ ఆఫీసును ముట్టడించిన కార్మికులు..

Palnadu: జీతాలు చెల్లించండి.. పంచాయతీ ఆఫీసును ముట్టడించిన కార్మికులు..

Palnadu: పల్నాడు జిల్లా క్రోసూరు గ్రామ పంచాయతీ ఆఫీసు కార్యాలయాన్ని పంచాయతీ కార్మికులు ముట్టడించారు. 8 నెలల బకాయిని వెంటనే చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికులు ఆఫీసుకు తాళాలు వేసి ఆఫీసు ముందు బైఠాయించారు. జగనన్న పుట్టిన రోజున బయట నుంచి కూలీలను తీసుకువచ్చి వీధులను శుభ్రం చేయటం ఏమిటని కార్మికులు ప్రశ్నించారు.


పండుగకు జీతాలు ఇవ్వకపోతే మేము ఎలా బతకాలని పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జీతాలు ఇచ్చే వరకూ ఆఫీసు ముందు బైఠాయించి కదిలేదే లేదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఇప్పటికైనా స్పందించి.. తమకు జీతాలు ఇప్పించాలని కార్మికులు వేడుకుంటున్నారు.

జీతాలు చెల్లించకపోవడంతో.. కార్మికులు పారిశుద్ధ్య పనులను నిలిపివేశారు. దాంతో గ్రామంలో చెత్తా చెదారం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. చెత్త ఇలానే పేరుకుపోయి ఉంటే.. అంటువ్యాధులు ప్రబలుతాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Tags

Related News

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

Top 20 News @ 9 PM: గ్రోత్ హబ్‌గా విశాఖ, కేటీఆర్‌కి వ్యతిరేఖంగా పోస్టర్స్

Spurious Ghee: కోటి సంతకాల సంగతి దేవుడెరుగు.. ముందు కల్తీ నెయ్యిలోనుంచి బయటపడేదెలా?

CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్.. ఇక తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ మినిస్టర్లదే: సీఎం చంద్రబాబు

AP Cabinet Decisions: రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.. మరిన్ని కీలక నిర్ణయాలు

Top 20 News @ 8 PM: కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు ఆరోపణలు, ఉపాధ్యాయుడు దాడి.. వినికిడి కోల్పోయిన విద్యార్ధి

Top 20 News @ 7 PM: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. త్రిషా ఇంటికి బాంబు బెదిరింపు..!

Big Stories

×