BigTV English

Palnadu: జీతాలు చెల్లించండి.. పంచాయతీ ఆఫీసును ముట్టడించిన కార్మికులు..

Palnadu: జీతాలు చెల్లించండి.. పంచాయతీ ఆఫీసును ముట్టడించిన కార్మికులు..

Palnadu: పల్నాడు జిల్లా క్రోసూరు గ్రామ పంచాయతీ ఆఫీసు కార్యాలయాన్ని పంచాయతీ కార్మికులు ముట్టడించారు. 8 నెలల బకాయిని వెంటనే చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికులు ఆఫీసుకు తాళాలు వేసి ఆఫీసు ముందు బైఠాయించారు. జగనన్న పుట్టిన రోజున బయట నుంచి కూలీలను తీసుకువచ్చి వీధులను శుభ్రం చేయటం ఏమిటని కార్మికులు ప్రశ్నించారు.


పండుగకు జీతాలు ఇవ్వకపోతే మేము ఎలా బతకాలని పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జీతాలు ఇచ్చే వరకూ ఆఫీసు ముందు బైఠాయించి కదిలేదే లేదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఇప్పటికైనా స్పందించి.. తమకు జీతాలు ఇప్పించాలని కార్మికులు వేడుకుంటున్నారు.

జీతాలు చెల్లించకపోవడంతో.. కార్మికులు పారిశుద్ధ్య పనులను నిలిపివేశారు. దాంతో గ్రామంలో చెత్తా చెదారం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. చెత్త ఇలానే పేరుకుపోయి ఉంటే.. అంటువ్యాధులు ప్రబలుతాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Tags

Related News

Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Cm Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సీఎం చంద్రబాబు సీరియస్

Ayyanna vs Jagan: జగన్ రప్పా రప్పా కామెంట్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం, ఆయన్ని చూసి నేర్చుకో

Big Stories

×