Parakamani Theft Case: టీటీడీ పరకామణి చోరీ కేసులో ఏం జరుగుతోంది? హైకోర్టు కీలక ఆదేశాల వెనుక ఏం జరిగింది? సాక్షులు, నిందితుడికి బెదిరింపులు మొదలయ్యాయా? సతీష్కుమార్ హత్య నేపథ్యంలో కీలక ఆదేశాలు ఇచ్చిందా? ఇకపై సాక్షులు, నిందితులు విచారణకు హాజరుకావచ్చా? అవుననే సంకేతాలు మొదలయ్యాయి.
టీటీడీ పరకామణి చోరీ కేసు
పరాకామణి చోరీ కేసులో మంగళవారం ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీష్కుమార్ మృతి నేపథ్యంలో సాక్షులు- నిందితుడు రవికుమార్కు పోలీసు రక్షణ కల్సించాలని పేర్కొంది. దర్యాప్తు పూర్తి అయ్యేవరకు వారికి రక్షణ కల్పించాలని సీఐడీని ఆదేశించింది.
టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీష్కుమార్ అసహజ మృతిపై తాము షాకింగ్కు గురయ్యామని వ్యాఖ్యానించారు న్యాయస్థానం. ఈ కేసు దర్యాప్తులో తనతోపాటు కింది స్థాయి అధికారులు పాల్గొంనేందుకు అనుమతించాలని సీఐడీ మెమో దాఖలు చేసింది. అందుకు న్యాయస్థానం వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను డిసెంబర్ రెండుకి వాయిదా వేసింది న్యాయస్థానం.
కీలక ఆదేశాలు ఇచ్చిన ఏపీ హైకోర్టు
పరకామణి చోరీ కేసు కీలక మలుపు తిరగనుంది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని ఇప్పటికే చాలామందికి నోటీసులు ఇచ్చింది సీఐడీ. ఈ కేసులో కీలక నేతల ప్రమేయం ఉన్నట్లు వార్తలు లేకపోలేదు. ఫిర్యాదు చేసిన టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీష్కుమార్ మృతి చెందారు. తొలుత ఆయనది ఆత్మహత్యగా అనుకున్నా, అది ముమ్మాటికీ హత్యనని సీఐడీ భావిస్తోంది. దీంతో సతీష్ మృతి కేసు లోతుగా దర్యాప్తు చేస్తోంది.
ALSO READ: ఏపీ ప్రభుత్వానికి రాజధాని రైతులు అల్టిమేటం
కీలక సాక్షి మృతి చెందడంతో చాలామందిని సాక్షి చెప్పడానికి వెనుకడుగు వేసినట్టు వార్తలు లేకపోలేదు. ఈ విషయం బయటపెట్టినందుకు టీటీడీ సభ్యుడు భానుప్రకాష్రెడ్డి, తనను వేధింపులకు గురి చేశారని మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. తనకు బెదిరింపులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ కేసు దర్యాప్తు జోరందుకోనుంది.