E-Paper
Advertisement

Pawan Kalyan: ఎస్సైని కొట్టిన జగన్.. పవన్ సంచలనం.. అతనో విప్లవకారుడా?

Pawan Kalyan: ఎస్సైని కొట్టిన జగన్.. పవన్ సంచలనం.. అతనో విప్లవకారుడా?
Advertisement
PAWAN KALYAN JAGAN

Pawan Kalyan latest political news(AP breaking news today): వారాహి యాత్రతో వైసీపీ పంబ రేగ్గొడుతున్నారు పవన్ కల్యాణ్. గోదావరి జిల్లాల్లో తిరుగుతూ.. ఊరూరా జగన్ అరాచకాలను ఎండగడుతున్నారు. లేటెస్ట్‌గా నరసాపురం సభలో జగన్ గురించి మరో ఆసక్తికర విషయం చెప్పారు.

ఉద్యోగాలు, ఉపాధి, స్కిల్స్ ట్రైనింగ్ లేక యువత మంచి భవిష్యత్తును కోల్పోతున్నారని అన్నారు. ఈ సందర్భంగా మీ వయసులో ఉన్నప్పుడు జగన్ ఏం చేసేవాడో తెలుసా? అంటూ ఫ్లాష్ బ్యాక్ వివరించారు.

Advertisement

జగన్‌కు 19-21 ఏళ్ల వయసుల్లో.. తండ్రి ఎమ్మెల్యే అని విర్రవీగుతూ.. జూబ్లీహిల్స్, కడపలో దౌర్జన్యాలు చేసేవాడని చెప్పారు. పులివెందులలో ఓ ఎస్సైని పోలీస్ స్టేషన్లోనే కొట్టాడని అన్నారు. అలాంటి రౌడీ నాయకుడిని గెలిపిస్తే.. అరాచకాలు చేయక ఇంకేం చేస్తాడని మండిపడ్డారు. వైసీపీ నేతలంతా అలానే తయారయ్యారని.. గోదావరి జిల్లాలకు చెందిన ఓ మంత్రి కొడుకు.. డీఎస్పీని కొట్టాడని చెప్పారు. పులివెందుల రౌడీయిజాన్ని కోనసీమకు తీసుకొస్తే ఊరుకునేది లేదని.. ఉరికించి కొడతామని హెచ్చరించారు జనసేనాని.

జగన్ గురించి పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్నాయి. వైఎస్సార్ ఉన్నరోజుల్లో జగన్ దూకుడుగా ఉండేవారని అంటారు. హీరో బాలయ్యకు వీరాభిమాని అనికూడా చెబుతారు. అప్పట్లో ఓ కాంగ్రెస్ కార్యకర్తను స్థానిక ఎస్సై అరెస్ట్ చేస్తే.. ఆ విషయం తెలిసి జగన్ కోపంతో ఊగిపోతూ స్టేషన్‌కు వెళ్లాడని.. అక్కడ ఉన్న ఎస్సైని కొట్టాడని అంటుంటారు. జగన్ రౌడీయిజం, ఎస్సైని కొట్టడం గురించి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఓ కమ్యూనిస్టు సానుభూతిపరుడు ప్రశ్నిస్తే.. ఏం చేద్దాం.. మా అబ్బాయి జగన్‌ కూడా మీలా ఓ విప్లవకారుడే అన్నారట. వైఎస్సార్ ఆన్సర్ విని ఆ కామ్రేడ్ అవాక్కయ్యారట. ఈ విషయం ఆ పెద్దాయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అదే ఎస్సైను కొట్టిన మేటర్ ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా ప్రస్తావించారని అంటున్నారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×