E-Paper
Advertisement

Tirupati Sabha: ఈ కూటమికి తిరుగుండదు, తిరుపతి కూటమి సభ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Tirupati Sabha: ఈ కూటమికి తిరుగుండదు, తిరుపతి కూటమి సభ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Advertisement

Tirupati Sabha: వ్యవస్థలను బలోపేతం, విలువలను కాపాడే దిశగా, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తే ఈ కూటమికి తిరుగు ఉండదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి సాధించిన విజయం ప్రజలదేననన్నారు. ఇది అహంకారం, విధ్వంసంపై ప్రజాస్వామ్యం సాధించిన విజయమన్నారు. ఏపీ పునర్ నిర్మాణం కోసం ఏర్పడిన కూటమని మనసులోని మాట బయటపెట్టారు.

ఈ కూటమికి తిరుగుండదు- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 

Advertisement

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తిరుపతిలో కూటమి ప్రభుత్వం ‘రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి సంక్షేమం’ పేరిట బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలంటే ఒక రాష్ట్రం కులాల పరిమితులను దాటాలన్నారు.

మరొకటి ప్రాంతీయత పరిమితులను దాటాలన్నారు. మనందరు భారతీయత వైపు అడుగులు వేయాలన్నారు. కూటమిలో జనసేన కేవలం 21 సీట్లతో సరిపెట్టుకుందని చాలామంది విమర్శించారని గుర్తు చేశారు. ప్రజల ఆశీర్వాదంతో 100 స్ట్రైక్‌ రేట్‌ సాధించామని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నట్లు వివరించారు.

Advertisement

రాష్ట్రాలు కులాలు, ప్రాంతీయత పరిమితులు దాటాలి- డిప్యూటీ సీఎం

పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలోపేతానికి నిబద్ధతతో పని చేస్తున్నామని తెలిపారు. ఎన్డీయే సమష్టి కృషితో విశాఖ స్టీల్‌‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగకుండా ఆపామని, అనుకోకుండా జరిగిన ప్రమాదంలో 9 మంది మరణించారని తెలిపారు. ఈనెల 9న జరగాల్సిన ఈ కార్యక్రమం శుక్రవారం జరుపుకొంటున్నామని చెబుతూనే ప్రజాస్వామ్యంలో అంతిమంగా న్యాయనిర్ణేతలు ప్రజలేనని తేల్చేశారు డిప్యూటీ సీఎం అన్నారు.

 

Related News

టీడీపీ విచారణ కమిటీ ముందు బొండా ఉమా క్లారిటీ.. ఎమన్నారంటే!

తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కాలేజీలో ఫుడ్ పాయిజన్ కలకలం!

భార్యను కత్తితో బెదిరించి.. ఒంటికి నిప్పు అంటించుకున్న భర్త!

గురుకులం హాస్టల్‌లో అర్ధరాత్రి మిస్ అయిన 3వ తరగతి చిన్నారి!

మెగా డీఎస్సీపై రోజా ఫైర్.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే!

రామాలయ వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామ!

ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్.. రూ.281 కోట్ల నిధులు విడుదల!

కోనసీమ జిల్లాలో దారుణం.. భారీ వర్షానికి ఇంటి స్లాబ్ కూలి మహిళ మృతి!

Big Stories

Advertisement
×