Tirupati Sabha: వ్యవస్థలను బలోపేతం, విలువలను కాపాడే దిశగా, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తే ఈ కూటమికి తిరుగు ఉండదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి సాధించిన విజయం ప్రజలదేననన్నారు. ఇది అహంకారం, విధ్వంసంపై ప్రజాస్వామ్యం సాధించిన విజయమన్నారు. ఏపీ పునర్ నిర్మాణం కోసం ఏర్పడిన కూటమని మనసులోని మాట బయటపెట్టారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తిరుపతిలో కూటమి ప్రభుత్వం ‘రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి సంక్షేమం’ పేరిట బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలంటే ఒక రాష్ట్రం కులాల పరిమితులను దాటాలన్నారు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. మరొకటి ప్రాంతీయత పరిమితులను దాటాలన్నారు. మనందరు భారతీయత వైపు అడుగులు వేయాలన్నారు.