Food Poisoning: తిరుపతి జిల్లాలోని ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. విద్యార్ధులందరు వాంతులు వీరేచనాలతో కొంత మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటా హుడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.
ప్రస్థుతం అస్వస్థతకు గురైన విద్యార్థులను టీటీడీ సెంట్రల్ ఆసుపత్రిలో తక్షణ వైద్యం కోసం తరలించారు. విద్యార్ధుల్లో 20 మంది బాలికలు, 8 మంది బాలురు అస్వస్థతకు గురైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. చికిత్స అనంతరం విద్యార్థులందరూ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్ధుతం వారి నిలకడగా ఉన్నారని తెలిపారు. విద్యార్థులందరూ తిరిగి వసతి గృహాలకు చేరుకుని భోజనం చేశారు.
Also read: కోనసీమ జిల్లాలో దారుణం.. భారీ వర్షానికి ఇంటి స్లాబ్ కూలి మహిళ మృతి!
విద్యార్థులందరూ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆసుపత్రిని సందర్శించిన అధికారులు విద్యార్థులను టీటీడీ జేఈవో డా. ఎ శరత్ పరామర్శించారు. ప్రభుత్వం తరపున విద్యార్థులకు మెరుగైన వైద్యం సేవలు అందించామని టీటీడీ జేఈవో డా. ఎ శరత్ వెల్లడించారు.