E-Paper
Advertisement

టీడీపీ విచారణ కమిటీ ముందు బొండా ఉమా క్లారిటీ.. ఎమన్నారంటే!

టీడీపీ విచారణ కమిటీ ముందు బొండా ఉమా క్లారిటీ.. ఎమన్నారంటే!
Advertisement

Bonda Uma: టీడీపీ కార్యాలయంలో విచారణ ముగిసిన తర్వాత మీడియాతో బొండా ఉమా మాట్లాడారు. 25 ఏళ్లుగా టీడీపీలో ఉన్నా.. పార్టీ లైన్ ఎప్పుడూ దాటలేదని అన్నారు. చంద్రబాబు ఆదేశాలను ధిక్కరించే ప్రశ్నే లేదని, 2019-24 మధ్య ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేశానని గుర్తు చేశారు. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు నివాళులర్పించేందుకే వెళ్లానని, ఉదయం వెళ్లి సభ ముగిసిన వెంటనే తిరిగి వచ్చేశానిని అన్నారు.

నా మాటలు వక్రీకరించారు..

అక్కి నన్ను అంబటి రాంబాబు వచ్చి పలకరించారు. అందరి ముందే మాట్లాడుకున్నామని, అది రహస్యంగా జరిగిన సమావేశం కాదని క్లారిటీ ఇచ్చారు. సంస్మరణ సభకు అన్ని పార్టీల నాయకులు హాజరయ్యారని, నా వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వక్రీకరించారని వాపోయారు. కొన్ని దుష్టశక్తులు కావాలనే తప్పుడు ప్రచారం చేశాయని ఫైర్ అయ్యారు. పార్టీకి నష్టం జరిగిందా అనే అంశంపైనే వివరణ కోరారు. పల్లా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడికి పూర్తి వివరణ ఇచ్చానని తెలిపారు.

Advertisement

Also Read: రామాలయ వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామ!

వైసీపీ సోషల్ మీడియా.. 

చంద్రబాబు ఆదేశాల మేరకే కమిటీతో సమావేశమయ్యామని, జరిగిన విషయాలన్నీ కమిటీకి వివరించానని తెలిపారు. కోఆర్డినేషన్ లోపం తప్ప మరో తప్పు జరగలేదని, పార్టీ లైన్ దాటలేదని కమిటీకి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని తెలిపారు. పార్టీ సూచనలను పూర్తిగా పాటిస్తామని, వైసీపీ సోషల్ మీడియా కావాలనే నాపై అసత్య ప్రచారం చేసిందని అన్నారు.

సీఎంని కలుస్తాను..

Advertisement

నేను మాట్లాడని మాటలను కూడా నా పేరుతో ప్రచారం చేశారని, ఆ స్టేట్‌మెంట్లు ఎక్కడ ఇచ్చానో వీడియో చూపించండని సీరియస్ అయ్యారు. నేను మాట్లాడిన ప్రతి మాట కెమెరాల్లో రికార్డు అయింది. తప్పు మాట్లాడితే విమర్శించండి కానీ మాట్లాడనిది ఆపాదించొద్దని ఫైర్ అయ్యారు. తప్పుడు ప్రచారమే పార్టీలో అపోహలకు కారణమైందని, పార్టీ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానన్నారు. టీడీపీపై నా నిబద్ధత ఎప్పటికీ మారదని, చంద్రబాబు నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందిన స్ఫష్ట్రం చేశారు. రెండు రోజుల్లో సీఎం చంద్రబాబు లోకేష్ ను కలుసి పూర్తి వివరాలు ఆయనకు వెల్లడిస్తాని ఆయన చెప్పారు.

Also Read: ఇది కదా కావాల్సింది.. సింగిల్ ఛార్జ్‌తో 47 గంటల మ్యూజిక్, Vivo T5e ధర ఎంతంటే?

Related News

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం!

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్.. 12 గంటలు కూర్చో లేకపోతే ఎలా? ఫోన్లు వద్దని ముందే..

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, రికార్డు స్థాయిలో ఆదాయం

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రమాదం.. తెగిపోయిన గేటు ఇనుప రోప్

సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?

Big Stories

Advertisement
×