Chilli Farmers: మహబూబాబాద్ జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ ఎదుట మిర్చి అమ్మిన రైతులు అందోళన చేపట్టారు. 3 నెలల దాటిన వ్యాపారి డబ్బులు ఇవ్వటం లేదు అంటూ మిర్చి రైతులు మార్కెట్ ఎదుట ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్కు మిర్చి రైతులు తాళం వేసారు.
తమ డబ్బులుఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ వంటి పై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడున్న వారు రైతుని అడ్డకుని అతడిని రక్షించారు. రైతును ఎస్.ఐ ఉమా మార్కెట్ చైర్మన్ సూధకర్ ఆపారు. దీంతో మిర్చి రైతుకు ప్రమాదం తప్పింది. వ్యాపారి నుంచి డబ్బులు ఇప్పించాలని ఎస్ఐ, ఉమా కాళ్ళు రైతు హోలి మొక్కారు. మార్కెట్ ఎదుట కొనసాగుతున్న అందోళన కొద్దిపేపు ఉద్రుతంగా మారింది.
Also Read: సీదిరి అప్పలరాజు కుమారుడికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు!
మహబూబాబాద్ మార్కెట్ చైర్మన్ సూధకర్తో మిర్చి రైతులు వాగ్వివాదానికి దిగారు. దీంతో ఛైర్మన్ సుధాకర్ను మిర్చి రైతులు అడ్డుకున్నారు. మాకు డబ్బులు ఇచ్చేవరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని రైతులు డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెప్పారు.
Also Read: అధికారంలోకి రాగానే హైడ్రాని బంగాళాఖాతంలో విసిరేస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!