E-Paper
Advertisement

Pawan Comments on Jagan: నేను ఎంత తగ్గాలో అంత తగ్గా.. ఎందుకంటే..: పవన్ కల్యాణ్!

Pawan Comments on Jagan: నేను ఎంత తగ్గాలో అంత తగ్గా.. ఎందుకంటే..: పవన్ కల్యాణ్!
Advertisement

Pawan Kalyan Comments On Jagan: అధికారంలోకి వచ్చిన వెంటనే కైకలూరు నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శుక్రవారం ఏలూరు జిల్లా కైకలూరులో నిర్వహించిన వారాహి విజయభేరీ సభలో ఆయన ప్రసంగించారు. అసెంబ్లీలో చర్చ లేకుండానే లాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకొచ్చారని.. లాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు.. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు అంటూ పవన్ కల్యాణ్ ఆరోపించారు. ప్రజలు భయం లేకుండా బ్రతకాలన్నదే తన కోరిక అని.. రాష్ట్ర అభివృద్ధియే తన లక్ష్యమని, రాష్ట్రం కోసమే తాను ఎంత తగ్గాలో అంత తగ్గానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

కూటమి తరఫున బీజేపీ నుంచి కామినేని పోటీ చేస్తున్నారని.. అతడిని అధిక మెజారిటీతో గెలిపించాలని.. కాంటూరు సమస్యపై కామినేని కేంద్రంతో మాట్లాడుతారని ఆయన అన్నారు. కైకలూరు ఎమ్మెల్యేది కాదని.. కైకలూరు ప్రజలు ఆయనకు గానీ, ఆయన కొడుకు గానీ భయపడాల్సిన అవసరంలేదన్నారు. రాష్ట్ర భవిష్యత్ కు సంబంధించి ఎన్నికలు ఎంతో కీలకమని.. రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూలీలకు ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Advertisement

Also Read: చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది: జగన్

ఇటు సీఎం జగన్ పై ఆయన తీవ్రంగా ఫైరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఓ అబద్ధాల కోరు అని ఆయన అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో జర్నలిస్టులపై కేసులు పెట్టారన్నారు. మీడియాను కట్టడి చేసేందుకు జీవోను తీసుకొచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే కైకలూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధిపరుస్తామని ఆయన అన్నారు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తామన్నారు.

Tags

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×