E-Paper
Advertisement

Pawan Kalyan : టీడీపీతో పొత్తుకు ఢోకా లేదు.. జనసేన పోటీ చేసే స్థానాలివే..

Pawan Kalyan : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే 2 స్థానాలను ఆ పార్టీ అధినేత వవన్ కళ్యాణ్ ప్రకటించారు. టీడీపీ 2 సీట్లు ప్రకటించినందున తానూ 2 స్థానాలను ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజోలు, రాజానగరం నియోజకవర్గం నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో పవన్‌ కళ్యాణ్ పాల్గోన్నారు. జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు.

Pawan Kalyan : టీడీపీతో పొత్తుకు ఢోకా లేదు.. జనసేన పోటీ చేసే స్థానాలివే..
Advertisement

Pawan Kalyan : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే 2 స్థానాలను ఆ పార్టీ అధినేత వవన్ కళ్యాణ్ ప్రకటించారు. టీడీపీ 2 సీట్లు ప్రకటించినందున తానూ 2 స్థానాలను ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజోలు, రాజానగరం నియోజకవర్గం నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో పవన్‌ కళ్యాణ్ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు.


ఎన్నికల్లో టీడీపీతో కలిసే జనసేన పోటీ చేస్తుందన్నారు. ఆ పార్టీతో కలిస్తే జనసేన పార్టీ మరింత బలపడుతుందన్నారు. ఉమ్మడిగానే మేనిఫెస్టో ఉంటుందని సృష్టం చేశారు. పొత్తుల్లో ఒక మాట అటూ ఇటూ ఉంటుందన్నారు. తమ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై తనకు సృష్టమైన అవగాహన ఉందని తెలిపారు. సీఎం జగన్‌‌కి ఊరంతా శత్రువులే అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌‌పై తనకు ఎటువంటి వ్యక్తిగత కక్ష లేదని తెలిపారు. వైసీసీ నేతలకు కష్టమొస్తే తన వద్దకు రావాలని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ- జనసేన పొత్తు దెబ్బతినేలా కొందరు మాట్లాడుతున్నారన్నారు. 2024లో జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదు అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Advertisement

అంతకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండపేట, అరకు స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని వెల్లడించిన సంగతి తెలిసిందే.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×