E-Paper
Advertisement

Mulugu : రిపబ్లిక్ డే వేడుకల్లో విషాదం.. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి.. మంత్రి సీతక్క పరామర్శ..

Mulugu : రిపబ్లిక్ డే వేడుకల్లో విషాదం.. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి.. మంత్రి సీతక్క పరామర్శ..
Advertisement

Mulugu : ములుగు జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవం వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్సీ కాలనీలో కొందరు యువకులు కలిసి ఇనుప పోల్‌కు జాతీయ జెండాని ఎగరవేయాలని భావించారు. అయితే జాతీయ జెండాను అమర్చే క్రమంలో ప్రమాదవశాత్తు పైనున్న విద్యుత్ తీగలు తగిలి బోడ విజయ్(25) అంజిత్‌(35) చక్రి (25)‌లు విద్యుతాఘాతానికి గురయ్యారు.

స్థానికులు హుటాహుటిన బాధితులను ములుగు ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. అప్పటికే విజయ్, అజిత్‌లు మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. స్వల్ప గాయాలతో చక్రి క్షేమంగా ఉన్నట్టు వైద్యలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యుతఘాతంతో ఇద్దరు మృతి చెందడంతో జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

మృతుల కుటుంబాలను మంత్రి సీతక్క పరామర్శించారు. తక్షణ ఆర్థిక సహాయం కింద పదివేలు అందజేశారు. విద్యుత్ శాఖ తరపున ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల నష్టపరిహారం అందేలా చూస్తానని, వారి కుటుంబానికి అండగా ఉంటానని మంత్రి సీతక్క బాధిత కుటుంబాలకు హమీ ఇచ్చారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×