E-Paper
Advertisement

Mulugu : రిపబ్లిక్ డే వేడుకల్లో విషాదం.. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి.. మంత్రి సీతక్క పరామర్శ..

Mulugu : రిపబ్లిక్ డే వేడుకల్లో విషాదం.. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి.. మంత్రి సీతక్క పరామర్శ..

Mulugu : ములుగు జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవం వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్సీ కాలనీలో కొందరు యువకులు కలిసి ఇనుప పోల్‌కు జాతీయ జెండాని ఎగరవేయాలని భావించారు. అయితే జాతీయ జెండాను అమర్చే క్రమంలో ప్రమాదవశాత్తు పైనున్న విద్యుత్ తీగలు తగిలి బోడ విజయ్(25) అంజిత్‌(35) చక్రి (25)‌లు విద్యుతాఘాతానికి గురయ్యారు.

స్థానికులు హుటాహుటిన బాధితులను ములుగు ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. అప్పటికే విజయ్, అజిత్‌లు మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. స్వల్ప గాయాలతో చక్రి క్షేమంగా ఉన్నట్టు వైద్యలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యుతఘాతంతో ఇద్దరు మృతి చెందడంతో జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మృతుల కుటుంబాలను మంత్రి సీతక్క పరామర్శించారు. తక్షణ ఆర్థిక సహాయం కింద పదివేలు అందజేశారు. విద్యుత్ శాఖ తరపున ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల నష్టపరిహారం అందేలా చూస్తానని, వారి కుటుంబానికి అండగా ఉంటానని మంత్రి సీతక్క బాధిత కుటుంబాలకు హమీ ఇచ్చారు.

Tags

Related News

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

Big Stories

×