E-Paper
Advertisement

Pawan Kalyan: ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నాం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నాం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Advertisement

Pawan Kalyan: పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించామంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తాను సంపూర్ణ జీతం తీసుకుంటానని.. తీసుకున్న ప్రతి రూపాయికీ జవాబుదారీతనంగా తాను వ్యవహరిస్తానన్నారు. తాను తప్పు చేస్తే చొక్కా పట్టి నిలదీసే అధికారం ప్రజలకు ఉందని పవన్ కల్యాణ్ అన్నారు.

జనసేన పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో భేటీ అయ్యారు. ఈ భేటీలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తమ పార్టీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా భారీ మెజారిటీతో గెలిపించినందుకు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

‘ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నాం. అధికారంలోనూ భాగస్వామ్యం తీసుకుంటాం.. విపక్షంగానూ ఉంటాం. టెక్నికల్ గా అదెలా సాధ్యమనేది ఆలోచిస్తాం. కేంద్రంలోనూ కీలకంగా వ్యవహరించి రాష్ట్రానికి కావాల్సినవి సాధిస్తాం. గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు అభినందనలు’ అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అదేవిధంగా పిఠాపురంలో తన గెలుపు కోసం కృషి చేసిన వర్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: జనసేనకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పార్టీ పర్మినెంట్‌ గుర్తుగా ‘గాజు గ్లాసు’?

Advertisement

ఇదిలా ఉంటే.. ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. కూటమిలో భాగమైన జనసేన పార్టీ కూడా చరిత్ర సృష్టించింది. మొత్తం 21 స్థానాల్లో పోటీ చేసింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ జనసేన గెలిచిన విషయం తెలిసిందే. అదేవిధంగా 2 ఎంపీ స్థానాలను కూడా కైవసం చేసుకుంది.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×