Big Stories

Pawan kalyan: భారత్ ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత మోదీదే: పవన్ కళ్యాణ్

Pawan kalyan: భారత్ ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత మోదీకే దక్కుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా వేమగిరిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్న పవన్ ప్రసంగించారు. ఈ సభకు ప్రధాని మోదీ, టీడీపీ యువనేత నారా లోకేష్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రసంగానికి ముందు పవన్  మోదీకి పాదాభివందనం చేశారు.

- Advertisement -

భారత్ శక్తిని మోదీ ప్రపంచానికి చాటి చెప్పారని పవన్ కళ్యాణ్ అన్నారు. దేశానికి మోదీ అవసరం ఎంతైనా ఉందన్నారు. భారత్ వైపు చూడటానికి శత్రువులు కూడా బయపడుతున్నారని పేర్కొన్నారు. అయోధ్యకు రామచంద్రడిని తెచ్చిన మహానుభావుడు మోదీ అని కొనియాడారు. మోదీ పేరు చెబితే దేశంలోని అణువణువూ స్పందిస్తుందని తెలిపారు.

- Advertisement -

Also Read: వారంరోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం.. వైసీపీకి ఓటేస్తేనే పథకాలు : జగన్

కళాకారులను గుర్తించి ప్రోత్సహించిన ఘనత మోదీకి దక్కుతుందన్నారు. కేంద్రం తెచ్చిన పథకాలను వైసీపీ తన పథకాలని అసత్య ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో  కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News