E-Paper
Advertisement

Chandrababu : చంద్రబాబుతో పవన్ భేటీ.. పొత్తులపై చర్చ..?

Chandrababu : చంద్రబాబుతో పవన్ భేటీ.. పొత్తులపై చర్చ..?
Advertisement

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసం ఈ సమావేశానికి వేదికైంది. జనసేనానికి చంద్రబాబు స్వాగతం పలికి ఇంట్లోకి ఆహ్వానించారు. ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలు , ఇటీవల కుప్పంలో జరిగిన ఘటనలపైనా ఇరువురు నేతలు చర్చించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక బలోపేతానికి ఐక్య కార్యాచరణ రూపొందించే అంశంపై చర్చించారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌-1పైనా తాజా భేటీలో చర్చించారు. దాదాపు 2 గంటలపాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్రంలో తాజాా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

ఏపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఉమ్మడి పోరాటం చేయాలని ఇప్పటికే చంద్రబాబు, పవన్ నిర్ణయించారు. కొద్దినెలల క్రితం విజయవాడలోని ఓ హోటల్‌లో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు, పవన్‌ తాజా భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

Advertisement

అనంతపురం జిల్లా టీడీపీ సీనియర్ నేత , మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే అనంతపురం జిల్లాలో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేసినా తాను గెలిపిస్తానని భరోసా ఇచ్చారు. జనసేనాని గెలుపు బాధ్యతను తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. పవన్, చంద్రబాబు భేటీ నేపథ్యంలో…ప్రభాకర్ చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×