Bhogapuram Airport: ఏపీకి మంచి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కావాలని నాడు సీఎం చంద్రబాబు ఆలోచన చేశారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు కావలసిన భూమిని సేకరించి ఎయిర్ పోర్ట్ ఏర్పాటు నిర్మాణం చేశారని అన్నారు. ఎయిర్ పోర్టు టెండర్లకు పిలిచినప్పుడు జిఎంఆర్ ఏపీ మీద ఉన్న ప్రేమతో హై బిడ్డింగ్ వేసి మరి టెండర్ దక్కించుకున్నారని, ప్రస్తుతం ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి 20వేల టన్నులు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చని తెలిపారు. 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేసే విధంగా ఏర్పాటు చేశామిన అన్నారు.
ఏడు రెట్లు ప్రయాణికులు పెరిగిన వెళ్లే విధంగా భోగాపురం నిర్మాణం చేశామని, జగన్ అధికారంలోకి రాకముందే చంద్రబాబు 2200 ఎకరాల భూసేకరణ చేశారని గుర్తు చేశారు. జగన్ భోగాపురం వెళ్లి రైతులు భూములు ఇవ్వొద్దని, ప్రచారం చేశారు కోర్టులో కేసులు వేయించారు. చంద్రబాబు అధికారం కోల్పోయిన సమయానికి భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన భూమి కేవలం 500 ఎకరాలు మాత్రం పెండింగ్లో ఉందని తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో కేవలం 300 ఎకరాలు మాత్రమే సేకరించారని తెలిపారు.
Also Read: ఆయిల్ పామ్ రైతులకు బిగ్ షాక్.. అనుకున్న టార్గెట్ అంతా తుస్సేనా..!
భోగాపురం ఎయిర్పోర్ట్ జిఎంఆర్ వేసిన టెండర్ను జగన్ రీ టెండర్ చేశారని, జగన్ ఐదేళ్ల పాలనలో భోగాపురం ఎయిర్ పోర్టును ముందుకు పోనివ్వలేదని అన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 10సార్లు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం వెళ్లారని, భోగాపురం ఎయిర్పోర్ట్ ఐడియా కూటమి ప్రభుత్వానిదే అని అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ పై జగన్ డిబేట్కు రావాలని సవాల్ విసిరారు. అమరావతి రైతులను అడ్డుపెట్టి సీడ్ ఎక్సెస్ రోడ్లు రాకుండా జగన్ చేశారని ఫైర్ అయ్యారు. వైజాగ్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు 7 రోడ్లు కావాలి. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఐదు రోడ్లు పూర్తి చేశామని, ఐదేళ్లలో జగన్ ఒక్క రోడ్డు కూడా వేయలేదని అన్నారు. ప్రజలు అభివృద్ధిని అర్థం చేసుకోవాలని, అంబటి రాంబాబు నాపై చేసే వ్యాఖ్యలు నేను పట్టించుకోనని అన్నారు.
Also Read: ఆలూరులో అర్ధరాత్రి హైడ్రామా.. వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్!