Virupakshi Arrest: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు మరో 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
శనివారం రాత్రి సంగాల, నేమకళ్లా గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారంటూ వీరిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. బాధితుడైన తెదేపా కార్యకర్త శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిప్పగిరి పోలీసులు తక్షణమే స్పందించారు. ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కేసు నమోదు చేసిన అనంతరం, అర్ధరాత్రి వేళ పోలీసులు విరూపాక్షితో సహా 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. లీగల్ ప్రక్రియలో భాగంగా అరెస్టు చేసిన వారిని ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎదుట హాజరు పరిచారు. ఈ ఘటనతో ఆలూరు నియోజకవర్గ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Also Read: రంగనాథ్కు మద్దతుగా రోడ్డెక్కిన జనం.. ‘సేవ్ హైడ్రా’ అంటూ అమీర్పేట్లో ధర్నా!