BigTV English

PM Modi, Amit Shah Call to AP Voters: ఏపీ ఓటర్లకు మోదీ, అమిత్ షా పిలుపు.. ఆసక్తికర ట్వీట్స్

PM Modi, Amit Shah Call to AP Voters: ఏపీ ఓటర్లకు మోదీ, అమిత్ షా పిలుపు.. ఆసక్తికర ట్వీట్స్

PM Modi and Amit Shah Call to AP Voters: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభకు ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓటర్లకు పిలుపునిచ్చారు.


ప్రజలు రికార్డు స్థాయిలో పోలింగులో పాల్గొవాలని పిలుపునిచ్చారు. మొదటిసారి ఓటు వేసేవారు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నట్లు తన ట్వీట్‌లో ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మరోవైపు కేంద్రమంత్రి అమిత్ షా  కూడా తనదైన శైలిలో ట్వీట్ చేశారు. తెలుగు భాష, సంస్కృతి, గౌరవాన్ని రక్షించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. రాష్ట్రాన్ని మతమార్పిడి, అవినీతి, దుష్పరిపాలన నుండి విముక్తి చేయాలన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల అభ్యున్నతి కోసం కృషి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు అమిత్ షా.


Also Read: ఓటు వేసిన సీఎం జగన్, చంద్రబాబు, లోకేష్ ఫ్యామిలీలు, విజయంపై ధీమా

అటు తెలంగాణపై మరో ట్వీట్ చేశారు అమిత్ షా. రాష్ట్ర సంస్కృతిని, గౌరవాన్ని పెంపొందించాలన్నారు. సుపరిపాలనను కొనసాగించి, వ్యవసాయ రంగంలో ఆర్థిక బలాన్ని నింపాలని కోరారు. ముఖ్యంగా రైతుల సమస్యలపై శ్రద్ధ వహించి, బుజ్జగింపులు, అవినీతిని అంతం చేసే ప్రభుత్వానికి ఓటు వేయాలని ప్రజలను కోరారు. అభివృద్ధి, సమాన అవకాశాలను అందించడం ద్వారా ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు అధిక లాభం చేకూరుతుందని  పేర్కొన్నారు.

Also Read: PM Modi nomination: వారణాసిలో మోదీ నామినేషన్, మెజార్టీపైనే ఫోకస్

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×