E-Paper
Advertisement

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన.. పవన్ కళ్యాణ్ కు పరామర్శ.. చంద్రబాబుతో భేటీ!

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన.. పవన్ కళ్యాణ్ కు పరామర్శ.. చంద్రబాబుతో భేటీ!
Advertisement

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ తన హైదరాబాద్ పర్యటనలో భాగంగా జూబ్లీహిల్స్‌లోని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఇటీవల సైనస్ సమస్య కారణంగా శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్‌ను ప్రధాని ఆత్మీయంగా పరామర్శించారు.

ఈ భేటీలో ప్రధాని మోదీ పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆయనతో గడిపిన ప్రధాని.. పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తనను పరామర్శించేందుకు స్వయంగా ఇంటికి వచ్చినందుకు పవన్ కళ్యాణ్ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీయే (NDA) కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్‌ను ప్రధాని వ్యక్తిగతంగా పరామర్శించారు.

Advertisement

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన అనంతరం.. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబు నివాసంలో ప్రధానికి ఘనస్వాగతం లభించింది. చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి.. కుమారుడు నారా లోకేష్.. కోడలు బ్రాహ్మిణి ప్రధానిని సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబుతో ప్రధాని సుమారు సుమారు 60 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉభయ రాష్ట్రాల అభివృద్ధి.. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు.. కూటమి రాజకీయాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.

Read Also: గుజరాత్ మోడల్ vs తెలంగాణ మోడల్.. ముఖ్యమంత్రికి ప్రధాని అదిరిపోయే రిప్లై!

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×