E-Paper
Advertisement

Prakasam Crime : ప్రకాశం జిల్లాలో కీచక పర్వం.. విద్యార్థిని ట్రాప్ చేసిన ఉపాధ్యాయుడు..

Prakasam Crime : ప్రకాశం జిల్లాలో కీచక పర్వం.. విద్యార్థిని ట్రాప్ చేసిన ఉపాధ్యాయుడు..
Advertisement

Prakasam Crime : విద్యాబుద్దులు నేర్పాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఏకంగా తన ఇంటికి తీసుకొని వెళ్ళి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దారుణం ప్రకాశం జిల్లా దోర్నాలలో చోటు చేసుకుంది . వివరాల్లోకి వెళితే దోర్నాల జిల్లా పరిషత్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడుగా పని చేస్తున శ్రీనివాస్ ప్రసాద్ ఒక బాలికకు మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆయన చేస్టలకు విసిగిపోయింది. అక్కడి నుంచి తిరిగి తన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.

విద్యార్థిని అన్న బాజీ కోపంతో ఉపాధ్యాయుడి ఇంటికి వెళ్ళి నిలదీశాడు. శ్రీనివాస ప్రసాద్ నన్నే నిలదీస్తావా అంటూ.. కత్తితో బాజీపై దాడికి పాల్పడ్డాడు. దీంతో బాజీకి గాయాలయ్యాయి. వెంటనే బాజీని దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటన పై పోలీసులు, విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. విద్యార్థిని తల్లిదండ్రులు న్యాయం చేయాలని.. ఇలాంటి ఉపాధ్యాయులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఇలాంటి వారుంటే ఆడపిల్లల్ని చదివించాలనే ఆలోచన కూడా ఎవరికీ ఉండదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×