E-Paper
Advertisement

Prakasam Crime : ప్రకాశం జిల్లాలో కీచక పర్వం.. విద్యార్థిని ట్రాప్ చేసిన ఉపాధ్యాయుడు..

Prakasam Crime : ప్రకాశం జిల్లాలో కీచక పర్వం.. విద్యార్థిని ట్రాప్ చేసిన ఉపాధ్యాయుడు..
Advertisement

Prakasam Crime : విద్యాబుద్దులు నేర్పాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఏకంగా తన ఇంటికి తీసుకొని వెళ్ళి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దారుణం ప్రకాశం జిల్లా దోర్నాలలో చోటు చేసుకుంది . వివరాల్లోకి వెళితే దోర్నాల జిల్లా పరిషత్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడుగా పని చేస్తున శ్రీనివాస్ ప్రసాద్ ఒక బాలికకు మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆయన చేస్టలకు విసిగిపోయింది. అక్కడి నుంచి తిరిగి తన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.

విద్యార్థిని అన్న బాజీ కోపంతో ఉపాధ్యాయుడి ఇంటికి వెళ్ళి నిలదీశాడు. శ్రీనివాస ప్రసాద్ నన్నే నిలదీస్తావా అంటూ.. కత్తితో బాజీపై దాడికి పాల్పడ్డాడు. దీంతో బాజీకి గాయాలయ్యాయి. వెంటనే బాజీని దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటన పై పోలీసులు, విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. విద్యార్థిని తల్లిదండ్రులు న్యాయం చేయాలని.. ఇలాంటి ఉపాధ్యాయులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఇలాంటి వారుంటే ఆడపిల్లల్ని చదివించాలనే ఆలోచన కూడా ఎవరికీ ఉండదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×