E-Paper
Advertisement

Andhra Pradesh: రైలు పట్టాలపై గర్భిణీ ప్రసవం.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే షాక్!

Andhra Pradesh: రైలు పట్టాలపై గర్భిణీ  ప్రసవం.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే షాక్!
Advertisement

Andhra Pradesh: ఏపీలో నిన్న దారుణ ఘటన చోటుచేసుకుంది.. అయితే పార్వతీపురం మన్యం జిల్లాలో మంగళవారం ఉదయం ఒక గర్భిణికి ఎదురైన అనుభవం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రియ పాత్ర అనే మహిళ బరంపూర్ నుండి సూరత్ వెళ్తున్న ‘అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్’లో ప్రయాణిస్తుండగా, ఒక్కసారిగా ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. రైలు ప్రయాణంలో ఉండగానే నొప్పులు తీవ్రం కావడంతో తోటి ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

అయితే పరిస్థితిని గమనించిన రైల్వే సిబ్బంది, తక్షణమే స్పందించి బెలగాం స్టేషన్ వద్ద రైలును అత్యవసరంగా నిలిపివేశారు. ఆ గర్భిణిని సురక్షితంగా కిందకు దించేందుకు కుటుంబ సభ్యులు, తోటి మహిళా ప్రయాణికులు సహకరించారు. రైలు దిగి ఆసుపత్రికి వెళ్లే క్రమంలో రైలు పట్టాలను దాటుతుండగా, ఆమెకు నొప్పులు మరింత ఎక్కువయ్యాయి.

Advertisement

సమయం మించిపోతుండటంతో, వేరే దారి లేక రైలు పట్టాల పక్కనే ఆమె ప్రసవించాల్సి వచ్చింది. తోటి మహిళల సహకారంతో ఆమె అక్కడే ఒక బిడ్డకు జన్మనిచ్చారు. నిండు గర్భిణిగా రైలు దిగిన ఆమె, పట్టాలపైనే ప్రసవించడం అక్కడ ఉన్న వారందరినీ ఒకింత ఆందోళనకు, మరికొంత ఆశ్చర్యానికి గురిచేసింది.

Also Read: సంక్రాంతి వేళ గోదావరి జిల్లాలో కోడిపందాల జోరు.. లక్షల్లో బెట్టింగులు

Advertisement

అలాగే ప్రసవం అనంతరం స్థానికులు, బంధువులు కలిసి తల్లిని, పసిబిడ్డను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా సకాలంలో స్పందించిన తోటి ప్రయాణికులను, స్థానికులను అందరూ అభినందిస్తున్నారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×