E-Paper
Advertisement

Andhra Pradesh: రైలు పట్టాలపై గర్భిణీ ప్రసవం.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే షాక్!

Andhra Pradesh: రైలు పట్టాలపై గర్భిణీ  ప్రసవం.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే షాక్!
Advertisement

Andhra Pradesh: ఏపీలో నిన్న దారుణ ఘటన చోటుచేసుకుంది.. అయితే పార్వతీపురం మన్యం జిల్లాలో మంగళవారం ఉదయం ఒక గర్భిణికి ఎదురైన అనుభవం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రియ పాత్ర అనే మహిళ బరంపూర్ నుండి సూరత్ వెళ్తున్న ‘అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్’లో ప్రయాణిస్తుండగా, ఒక్కసారిగా ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. రైలు ప్రయాణంలో ఉండగానే నొప్పులు తీవ్రం కావడంతో తోటి ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

అయితే పరిస్థితిని గమనించిన రైల్వే సిబ్బంది, తక్షణమే స్పందించి బెలగాం స్టేషన్ వద్ద రైలును అత్యవసరంగా నిలిపివేశారు. ఆ గర్భిణిని సురక్షితంగా కిందకు దించేందుకు కుటుంబ సభ్యులు, తోటి మహిళా ప్రయాణికులు సహకరించారు. రైలు దిగి ఆసుపత్రికి వెళ్లే క్రమంలో రైలు పట్టాలను దాటుతుండగా, ఆమెకు నొప్పులు మరింత ఎక్కువయ్యాయి.

Advertisement

సమయం మించిపోతుండటంతో, వేరే దారి లేక రైలు పట్టాల పక్కనే ఆమె ప్రసవించాల్సి వచ్చింది. తోటి మహిళల సహకారంతో ఆమె అక్కడే ఒక బిడ్డకు జన్మనిచ్చారు. నిండు గర్భిణిగా రైలు దిగిన ఆమె, పట్టాలపైనే ప్రసవించడం అక్కడ ఉన్న వారందరినీ ఒకింత ఆందోళనకు, మరికొంత ఆశ్చర్యానికి గురిచేసింది.

Also Read: సంక్రాంతి వేళ గోదావరి జిల్లాలో కోడిపందాల జోరు.. లక్షల్లో బెట్టింగులు

Advertisement

అలాగే ప్రసవం అనంతరం స్థానికులు, బంధువులు కలిసి తల్లిని, పసిబిడ్డను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా సకాలంలో స్పందించిన తోటి ప్రయాణికులను, స్థానికులను అందరూ అభినందిస్తున్నారు.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×