Draupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు తిరుపతికి చేరుకోనున్నారు. నవంబర్ 20, 21 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి-తిరుమల పవిత్ర క్షేత్రాలను సందర్శించుకోనున్నారు.
రాష్ట్రపతి ముర్ము పర్యటన షెడ్యూల్..
నేడు మధ్యాహ్నం 3:25 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చేరుకుంటారు. ఇక్కడ వారికి గౌరవపూర్వక స్వాగతం అందించబడుతుంది. జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP), టీటీడీ అధికారులు హాజరుకానున్నారు.
ఆ తర్వాత 3:55 గంటలకు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రోడ్డు మార్గంలో ప్రయాణించి చేరుకుని, ప్రత్యేక పూజలు, దర్శనం చేసుకుంటారు. ఆలయ ఆర్చకులు ప్రత్యేకమైన సేవలు, పూజలు నిర్వహిస్తారు.
సాయంత్రం 5:00 గంటలకు పద్మావతి అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని, తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకుని, ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుంటారు.
నవంబర్ 21 షెడ్యూల్
రేపు ఉదయం 9:30 గంటలకు తిరుమలలోని శ్రీ వరాహస్వామి ఆలయాన్ని మొదట దర్శించుకుంటారు. ఆలయ సంప్రదాయం ప్రకారం, శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందు వరాహస్వామి దర్శనం తప్పనిసరి.
ఆలాగే ఉదయం 10:00 గంటలకు కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామివారి ప్రధాన ఆలయంలో ప్రత్యేక దర్శనం, సేవలు చేసుకుంటారు. టీటీడీ అధికారులు, టీటీడీ చైర్మన్ వంటి ఉన్నతాధికారులు స్వాగతం అందిస్తారు. దర్శనం తర్వాత, ప్రసాదాలు స్వీకరిస్తారు.
Also Read: విశాఖలోని మద్దిలపాలెం ఫంక్షన్ హాల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు.
ఆ తర్వాత మధ్యాహ్నం 10:50 కు తిరుమల నుంచి 11:50 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు బయలుదేరి వెళ్తారని చెప్పారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేడు తిరుపతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
సా. 4 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం
అమ్మవారి దర్శనం అనంతరం తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రికి బస
రేపు ఉదయం 9.30 గంటలకు తిరుమలలో శ్రీ… pic.twitter.com/nku4wVEL7T
— BIG TV Breaking News (@bigtvtelugu) November 20, 2025