Fire Accident: వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మృత్యువు ఏదో ఒక రూపంలో వస్తున్నాడు. నేడు ఒక్క రోజే రెండు ప్రాంతాల్లో బారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయి. ఇలా వరుస ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. నేడు విశాఖలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
విశాఖలోని మద్దిలపాలెం ఫంక్షన్ హాల్లో అగ్ని ప్రమాదం..
విశాఖ మద్దిలపాలెంలోని వంశీ ఫంక్షన్ హాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నాలు ప్రారంభించారు.
ఫంక్షన్ హాల్ మొత్తం దట్టమైన పొగ కమ్మేయడంతో మంటలను అదుపు చేయడం వారికి కష్టంగా మారింది. ప్రాణ నష్టం జరగనప్పటికీ, ఆస్తి నష్టం భారీగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి గల పూర్తి కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమై ఉండవచ్చని సిబ్బంది ప్రాథమికంగా భావిస్తున్నారు.
విశాఖ మద్దిలపాలెం ఇసుక తోట సమీపంలోని వంశీ ఫంక్షన్ హాల్లో అగ్ని ప్రమాదం..
ఒక్కసారిగా చెలరేగిన మంటలు
మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని భావిస్తున్న ఫైర్ సేఫ్టీ అధికారులు pic.twitter.com/QvkhM2TrQ7
— BIG TV Breaking News (@bigtvtelugu) November 20, 2025
Also Read: తీవ్ర విషాదం.. శబరిమల యాత్రలో అపశృతి.. క్యూలైన్లో మహిళ మృతి..!
మరో అగ్ని ప్రమాదం..
లారీలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు..
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల జాతీయ రహదారిపై వెళుతున్న ఒక లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో మంటలు గమనించిన లారీ డ్రైవర్ వెంటనే దిగిపోయాడు. అయితే వైర్ల లోడుతో మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా దగ్దమై.. కాలి బూడిదైన వైర్లు.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు..
లారీలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు..
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్ జాతీయ రహదారిపై ఘటన
మంటలను గమనించి లారీ నుంచి దిగిపోయిన డ్రైవర్
వైర్ల లోడుతో మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన
ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన లారీ, కాలి బూడిదైన వైర్లు pic.twitter.com/jYkJoIpInU
— BIG TV Breaking News (@bigtvtelugu) November 20, 2025