E-Paper
Advertisement

డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడ్డ బస్సు.. స్పాట్‌లో 26 మంది ప్రయాణికులు!

డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడ్డ బస్సు.. స్పాట్‌లో 26 మంది ప్రయాణికులు!
Advertisement

Bus Accident: విజయవాడ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం వేకువజామున ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న వైబీఎం ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అమరావతి పరిధిలోని తేలప్రోలు సమీపంలో ఉన్న జాతీయ రహదారి-16పై ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న ఈ బస్సు అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొని బోల్తా పడింది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 26 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఈ దుర్ఘటనలో 12 మందికి తీవ్ర రక్తగాయాలు కాగా, మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించి బస్సును తప్పించే క్రమంలో వెనుక నుంచి వస్తున్న ఒక లారీ మరో వాహనాన్ని ఢీకొట్టడంతో, ఆ లారీ డ్రైవర్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement

సమాచారం అందుకున్న వెంటనే గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర, ఆత్కూరు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ప్రయాణికులను స్థానికుల సహాయంతో వెంటనే సమీపంలోని చిన్న అవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

Also Read: హార్పిక్ ఘటన మరువక ముందే.. కూరలో విషం కలిపి భర్త, అత్తపై హత్యాయత్నం!

Tags

Related News

డ్వాక్రా మహిళలకు ఊరట.. రూ.25 వేలకు పైగానే, ఆనందంలో సంఘాలు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్.. గుజరాత్ నుంచి ఏపీకి తరలింపు, అసలు కేసు ఏంటి?

ఇవాళ భారీ వర్షాలు, తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, ఆ జిల్లాలకు ముఖ్య సూచనలు

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

Big Stories

Advertisement
×