E-Paper
Advertisement

హార్పిక్ ఘటన మరువక ముందే.. కూరలో విషం కలిపి భర్త, అత్తపై హత్యాయత్నం!

హార్పిక్ ఘటన మరువక ముందే.. కూరలో విషం కలిపి భర్త, అత్తపై హత్యాయత్నం!
Advertisement

Nizamabad: సమాజంలో వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో ఆరిపోని చిచ్చు పెడుతున్నాయి. నూరేళ్ల పంటగా నిలవాల్సిన వైవాహిక బంధాలను అక్రమ సంబంధాలు దారుణంగా బలితీసుకుంటున్నాయి. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో హార్పిక్ లిక్విడ్‌తో భర్తను హతమార్చిన దారుణ సంఘటన మరువక ముందే, జిల్లాలో మరో సంచలన హత్యాయత్నం వెలుగు చూసింది.

మిల్ మేకర్ కూరలో గడ్డిమందు..

Advertisement

మోపాల్ మండల పరిధిలో ఓ మహిళ తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని భావించి భర్త, అత్తలను మట్టుబెట్టాలని ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా ఇంట్లో వండిన మిల్ మేకర్ కూరలో ఎవరికీ అనుమానం రాకుండా గడ్డిమందు కలిపింది. ఆ ఆహారాన్ని తిన్న వెంటనే భర్త, అత్త తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణపాయం తప్పింది.

రిమాండ్‌కు తరలింపు..

Advertisement

బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన మోపాల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మోపాల్ ఎస్‌ఐ సుష్మిత తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసుల విచారణలో నిందితురాలు సోనీ తన అక్రమ సంబంధం కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఒప్పుకుంది. దీంతో ఆమెను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు.

ఈ వరుస కుటుంబ నేరాలు నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also Read: రష్యా బీచ్‌పై డ్రోన్ దాడి.. 7 గురు మృతి, 40 మందికి గాయాలు

Tags

Related News

ఇవాళ భారీ వర్షాలు, తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, ఆ జిల్లాలకు ముఖ్య సూచనలు

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

Big Stories

Advertisement
×